హైదరాబాద్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్టీల బోర్డు నియామకాల చట్టబద్ధతను , ఆలయ నిర్వహణకు సంబంధించిన నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల నియమితులైన ట్రస్టీల బోర్డు నుండి తెలంగాణ హైకోర్టు స్పందన కోరింది . భక్తుడు నాగిల్లా శ్రీనివాస్ , వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరాయని నరసింహ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ , జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఏర్పాటు చేసిన 10 మంది సభ్యుల బోర్డులో చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి భార్య సురేఖ, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని, చెల్లనివని ప్రకటించాలని, అలాగే ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నియామకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ)ను నిలిపి వేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ‘తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్’ (ధార్మిక , హిందూ మతపరమైన సంస్థలు, దేవాదాయ చట్టం)లోని 96 మరియు 97 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తోంది.
పిటిషనర్ల ప్రకారం సవరించిన నిబంధనలు వ్యవస్థాపక ట్రస్టీని ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా నియమించే అవకాశం కల్పించడానికి బదులుగా, కేవలం ఓటు హక్కు కలిగిన సభ్యుని స్థాయికి పరిమితం చేశాయని ఆరోపించారు పిటిషన్ లో. ఇటువంటి జోక్యం ఆలయం అంతర్గత స్వయం ప్రతిపత్తిని, మతపరమైన సంప్రదాయాలను దెబ్బతీస్తుందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 25 , 26లను ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు. మతపరమైన సంస్థల సంప్రదాయాలు మరియు ఆచారాలను పరిరక్షించడంలో వ్యవస్థాపక కుటుంబాల పాత్రను గుర్తించిన సుప్రీంకోర్టు తీర్పులకు ప్రభుత్వ చర్య విరుద్ధమని వారు మరింతగా వాదించారు.
చట్టం ప్రకారం తప్పనిసరి అయిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా, కార్యనిర్వాహక ఉత్తర్వు (executive order) ద్వారా బోర్డును ఏర్పాటు చేయడం వంటి విధానపరమైన లోపాలు కూడా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ కోసం ఈ విషయాన్ని వాయిదా వేసింది. చట్టం ప్రకారం తప్పనిసరి అయిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా, ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా బోర్డును ఏర్పాటు చేశారని, ఇందులో విధానపరమైన అవకతవకలు జరిగాయని పిటిషనర్లు ఆరోపించారు. సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.



















