విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న్నా వైర‌ల్

ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థుల‌కు ఆర్థిక సాయం

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌మ‌ఖ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాల మ‌ధ్య కెమిస్ట్రీ మ‌రోసారి బహిరంగంగా వ్య‌క్త‌మైంది. ఈ ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరు విద్యా స్కాలర్‌షిప్‌లను కూడా ప్రకటించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తెలంగాణలోని అచ్చంపేట మండలం తుమ్మన్‌పేట గ్రామాన్ని సందర్శించారు. ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు తోడ్పడేలా ఒక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో బాగా చర్చనీయాంశమైంది; ఆ వీడియోలో నటి రష్మిక, విజయ్ నుదుటిపై ఉన్న చెమటను టిష్యూతో తుడిచి, అతని మీసాలను సరిచేసి, అతను బాగున్నాడని సూచించేలా తల ఊపడం కనిపించింది.

వారిద్దరి మధ్య ఉన్న ఈ ఆప్యాయతను చూసి అభిమానులు మురిసి పోతున్నారు. వారిపై అందమైన మీమ్స్ కూడా రూపొందిస్తున్నారు. విజ‌య్ స్వంత ఊరు తుమ్మ‌న్ పేట‌. గ‌త కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌త ఏడాది కూడా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుని టాప్ లో నిలిచిన పిల్ల‌ల‌కు సాయం చేశారు. ఈ ఏడాది కూడా లిస్టును ప్ర‌క‌టించారు. వారిని స్వ‌యంగా ఆహ్వానించి స్కాలర్ షిప్ ల‌ను అందించారు స్వ‌యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా.

Exit mobile version