Stock Market Shocking : గతవారం నష్టాల తర్వాత కాస్త సానుకూలంగా సూచీలు

కౌన్సిల్‌ చర్చలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు...

Hello Telugu - Stock Market Shocking

Hello Telugu - Stock Market Shocking

Stock Market : గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారం కాస్త పాజిటివ్‌ సెంటిమెంట్‌తో కదులుతున్నాయి. సోమవారం, మంగళవారం వరుస లాభాలను నమోదు చేసిన సూచీలు బుధవారం మాత్రం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. జీఎస్టీ కొత్త సంస్కరణలపై బుధ, గురువారాల్లో కౌన్సిల్‌ చర్చలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock Market – సూచీల పరిస్థితి

మంగళవారం ముగింపు (80,157)తో పోలిస్తే బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగసి, మళ్లీ వెనక్కి తగ్గింది. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 20 పాయింట్ల లాభంతో 80,177 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లోనే కొనసాగి, 9 పాయింట్ల లాభంతో 24,589 వద్ద ఉంది.

లాభాలు – నష్టాలు

ఇతర సూచీలు

మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, జీఎస్టీ సంస్కరణలపై కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ దిశను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల మదుపర్లు తాత్కాలికంగా జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నారని తెలుస్తోంది.

Also Read : GST Interesting Updates : ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ రేట్లు

Exit mobile version