Sonia Gandhi : ఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ (Sonia Gandhi) నిప్పులు చెరిగారు. పాలస్తీనాపై ఏకపక్షంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి మీద ఏ ఒక్కరికీ ఇంకొకరిపై ఆధిపత్యం చెలాయించేందుకు వీలు లేదన్నారు. కానీ ఇలాంటి దాడులకు పాల్పడడం భావ్యం కాదన్నారు. ప్రధానంగా పాలస్తీనాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడం దారుణమన్నారు. ఆయన ఇజ్రాయెల్ తో దోస్తీ చేస్తున్నారు కానీ నిరాటంకంగా కొనసాగుతున్న దారుణాలు, దాడుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు సోనియా గాంధీ. నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రతి నాయకుడు బెంజమిన్ నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం ద్వారానే జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు.
Sonia Gandhi Shocking Comments on PM Modi
పాలస్తీనా సమస్యపై భారతదేశం నాయకత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
మోడీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. భారతదేశం రాజ్యాంగ విలువలు లేదా దాని వ్యూహాత్మక ప్రయోజనాల కంటే ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యక్తిగతీకరించిన దౌత్య శైలి ఎప్పటికీ సమర్థనీయం కాదన్నారు. భారతదేశ విదేశాంగ విధానానికి మార్గదర్శక దిక్సూచిగా ఉండ కూడదన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా అమెరికాలో ఇదే విధంగా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇటీవలి నెలల్లో అత్యంత బాధాకరమైన, అవమానకరమైన మార్గాల్లో విఫలం అయ్యాయని పేర్కొన్నారు .
Also Read : AP BJP Chief PVN Madhav Strong Demand : అమరావతిలో విశ్వ కర్మ విగ్రహం ఏర్పాటు చేయాలి
