Vice President Radhakrishnan Important : విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు రాధాకృష్ణ‌న్ కు ఆహ్వానం

ప‌త్రిక అందించిన రామ్మోహ‌న్ నాయుడు, కేశినేని

Hello Telugu - Vice President Radhakrishnan Important

Hello Telugu - Vice President Radhakrishnan Important

Radhakrishnan : ఢిల్లీ : విజ‌య‌వాడ న‌గ‌ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతి, చారిత్ర‌క‌, అధ్యాత్మిక వైభ‌వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు నిర్వ‌హిస్తున్న విజ‌య‌వాడ ఉత్స‌వ్ కు హాజ‌రు కావాల్సిందిగా ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధ కృష్ణ‌న్ (Radhakrishnan) ను కేంద్ర విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, ఎంపీ హ‌రీష్ బాల‌యోగి, రాజ్య స‌భ్య ఎంపీ సానా స‌తీష్ ల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానించారు. ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధ కృష్ణ‌న్ ను ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిసి విజయ‌వాడ ఉత్స‌వ్ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌త్క‌రించారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ కి విచ్చేయాల్సిందిగా రాధ‌కృష్ణ‌న్ ను ఆహ్వానించారు.

Vice President CP Radhakrishnan

అలాగే ఉప రాష్ట్రప‌తి సీపీ రాధ‌కృష్ణ‌న్ కు రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజ‌య‌వాడ ఉత్స‌వ్ మహోత్సవం జరుగుతుందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ వివ‌రించారు. విజయవాడ సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తూ, స్థానిక సంప్రదాయాల వైభవాన్ని దేశ వ్యాప్తంగా పరిచయం చేయడం ఈ ఉత్సవ లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గాన్నీ కలుపుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు..ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాల ప్రతీకగా నిలిచే విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మానికి త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తాన‌ని ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధ‌కృష్ణ‌న్ చెప్పిన‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డించారు.

Also Read : Indian Railways New Innovation : రైళ్లలో రైల్‌నీర్‌ వాటర్‌ బాటిల్ ధరలు తగ్గింపు

Exit mobile version