PM Modi Strong Response : అమెరికా సుంకాలపై ఘాటుగా స్పందించిన భారత ప్రధాని

ఎదుర్కొనే శక్తిని ప్రభుత్వం పెంపొందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు...

Hello Telugu - PM Modi Strong Response

Hello Telugu - PM Modi Strong Response

PM Modi : అమెరికా వాణిజ్య విధానాల్లో వచ్చిన మార్పులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుసంవర్ధకుల ప్రయోజనాలను ఏ విధంగానూ దెబ్బతీయనివ్వమని స్పష్టం చేశారు. ఎంతటి ఒత్తిడి వచ్చినా, వాటిని ఎదుర్కొనే శక్తిని ప్రభుత్వం పెంపొందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

PM Modi – ఆత్మనిర్భర్ భారత్‌కు గుజరాత్‌ ఆధారం

“నేడు ప్రపంచం ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలను ముందుకు నెడుతోంది. ఈ గాంధీ భూమి నుండి నా చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులు, పశుసంవర్ధక సోదరులకు హామీ ఇస్తున్నాను – మీ ప్రయోజనాలు మోదీ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనవి. గుజరాత్‌లోని రెండు దశాబ్దాల కృషి వల్లే ఆత్మనిర్భర్ భారత్‌ కార్యక్రమం బలంగా ముందుకు సాగుతోంది” అని ప్రధాని పేర్కొన్నారు.

PM Modi – ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్

పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, అది భారత సైన్యం ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిందని ప్రధాని అన్నారు. “స్వదేశీ మార్గాన్ని చూపిన గాంధీజీ ఆత్మను గతంలో కొన్ని పార్టీలు రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాయి. కానీ నేడు స్వచ్ఛత, స్వదేశీ అనే పదాలను వారు ప్రస్తావించడం లేదు” అని విమర్శించారు.

గుజరాత్‌లో శాంతి, అభివృద్ధి

గుజరాత్‌లో గతంలో తరచుగా కర్ఫ్యూలు విధించబడిన పరిస్థితులను గుర్తు చేసిన మోదీ, నేడు రాష్ట్రం శాంతి–భద్రతల కేంద్రంగా మారిందని తెలిపారు. “అహ్మదాబాద్ ఇప్పుడు దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటిగా నిలిచింది. పరిశ్రమలు, తయారీ రంగం విస్తరిస్తున్న గుజరాత్‌పై రాష్ట్ర ప్రజలందరికీ గర్వంగా ఉంది” అని చెప్పారు.

అమెరికా సుంకాలపై చర్యలు

ఇక అమెరికా వాణిజ్య సుంకాల ప్రభావాన్ని సమీక్షించేందుకు ఆగస్టు 26న ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో భారత ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించే చర్యలు చర్చించనున్నారు. వాషింగ్టన్ విధించిన కొత్త సుంకాల కారణంగా బుధవారం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై 50% వరకు పన్నులు విధించబడనున్నాయి.

Also Read : Huge Gold Seized : గడిచిన 10 ఏళ్లుగా వేల కేజీల బంగారాన్ని సీజ్ చేసిన కేంద్ర సర్కార్

Exit mobile version