Nirmala Sitharaman : చెన్నై : జీఎస్టీకి సంబంధించి విధించిన స్లాబ్ రేట్లను తగ్గించడంతో దేశ ఆర్థికాభివృద్దికి మరింత ఊతం ఇచ్చేలా చేస్తుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). 99 శాతం వస్తువులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, సంస్కరణలు అమలు చేయబడిన తర్వాత దేశ వ్యాప్తంగా భారీ మార్పును తీసుకు వస్తాయని, భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ పన్ను కోతలు తమిళనాడుకు ప్రత్యేకంగా ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో నిర్మలా సీతారామన్ వివరించారు. కొన్ని వస్తువులపై పన్ను 18 శాతం నుండి 5 శాతంకి , మరికొన్నింటిపై 12 శాతం నుండి 5 శాతానికి, మరికొన్నింటిపై 12 శాతం నుండి సున్నా శాతానికి తగ్గించడం జరిగిందని చెప్పారు.
Union Finance Minister Nirmala Sitharaman Key Comments
అవసరమైన వస్తువుల ద్వారా పౌరులను ప్రభావితం చేస్తుందని ఆమె నొక్కి చెప్పారు. ఆదివారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని చెన్నైలో రైజింగ్ భారత్ కోసం పన్ను సంస్కరణలు పేరుతో నిర్వహించిన వాణిజ్య, పరిశ్రమల సంఘం సంయుక్త సమావేశంలో ఆమె ప్రసంగించారు.
సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆవిష్కరించబడిన విస్తృత హేతుబద్ధీకరణ , సంస్కరణలు అమలులోకి వస్తే, దేశ వ్యాప్తంగా భారీ మార్పును తీసుకు వస్తాయని, భారతదేశంలోని 1.4 బిలియన్ల పౌరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
Also Read : Gold Price Growth : పసిడి ప్రియులకు స్వల్ప ఉరటనిచ్చిన ధరలు
