Medicine Price Relief : 35 రకాల మందులకు ఉరటనిచ్చిన కేంద్ర సర్కార్

యాంటీబయోటిక్స్‌తో పాటు ఇతర అనేక విభాగాలకు చెందిన ఔషధాలు ఉన్నాయి...

Hello Telugu - Medicine Price Relief

Hello Telugu - Medicine Price Relief

Medicine : దేశంలోని ప్రజలకు అత్యవసర మందులు (Medicine) మరింత చేరువ చేయాలని లక్ష్యంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఔషధ కంపెనీలు విక్రయించే 35 ముఖ్యమైన ఔషధాల రిటైల్ ధరలను తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల్లో గుండె, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు, యాంటీబయోటిక్స్‌తో పాటు ఇతర అనేక విభాగాలకు చెందిన ఔషధాలు ఉన్నాయి.

Medicine – తగ్గిన ధరలతో లభ్యమయ్యే మందులు:

ఎన్‌పీపీఏ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం:

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ విక్రయించే ధర: ₹13.00
క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే ధర: ₹15.01

ఈ నిర్ణయం ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించనుంది. ఔషధ వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదే దిశగా చర్యలు తీసుకుంటోంది.

మెడికల్ షాపులకు విధేయత తప్పనిసరి

ఎన్‌పీపీఏ ఉత్తర్వుల ప్రకారం, ఔషధ విక్రయ దుకాణాలు, డీలర్లు తమ షాపుల్లో తాజా ధరల వివరాలను బోర్డు ద్వారా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే, ఈ ధరలకు జీఎస్టీ అదనంగా వర్తించవచ్చని పేర్కొంది.

ధరలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిర్దేశించిన ధరలకు మించి విక్రయించిన సంస్థలపై ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులు (DPCO – 2013), నిత్యావసర వస్తువుల చట్టం (1955) ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. అలాగే, అధిక ధరకు విక్రయించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ చర్యలతో దేశవ్యాప్తంగా మందుల (Medicine) ధరలపై నియంత్రణ స్థిరంగా అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పౌరులు తాజా ధరలపై అవగాహన పెంచుకొని, తగిన జాగ్రత్తలతో మందులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Also Read : Fuel Price Shocking : ఆమ్మో పెట్రోల్ డీజిల్ ధరలు మల్లి పెరగనున్నాయా?

Exit mobile version