LuLu Group Huge Investments in Rayalaseema : రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్ మెంట్ ఎక్స్ పోర్ట్ కేంద్రం

రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్న లులు గ్రూప్

Hello Telugu - LuLu Group Huge Investments in Rayalaseema

Hello Telugu - LuLu Group Huge Investments in Rayalaseema

LuLu Group : విశాఖ‌పట్నం : ప్ర‌ఖ్యాత వ్యాపార సంస్థ లులు గ్రూప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఏపీలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయనున్న‌ట్లు వెల్ల‌డించింది. విశాఖపట్నంలో జ‌రిగిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో ఈ విష‌యాన్ని తెలిపారు లులు సంస్థ చైర్మ‌న్. ఇందులో భాగంగా రాయలసీమలో లాజిస్టిక్ ప్రొక్యూర్ మెంట్ ఎక్స్ పోర్ట్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులూ గ్రూప్ (LuLu Group) చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు. మూడేళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా కోరారు.

LuLu Group Investment

ప్రపంచ వ్యాప్తంగా 300కి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ సంస్థకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని కూడా సూచించారు సీఎం. మామిడి, జామ పల్ప్‌తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేసేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంలోనూ లులూ సంస్థ ఒప్పందాలు చేసుకున్నది. వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని సంస్థ చైర్మ‌న్ స్పష్టం చేశారు. త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు కూడా లులూ గ్రూప్ ప్రకటించింది. విశాఖ నగరంలో లులూ సంస్థ నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌తో 5 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

Also Read : Nitish Kumar Victory Again : నితీష్ కుమార్ మ‌రోసారి సీఎం అవుతారు

Exit mobile version