Jio Shocking : జియో కస్టమర్లకు మరో దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన ఆ సంస్థ

ఈ చర్యతో మధ్యతరగతి వినియోగదారులకు మళ్లీ ధరల భారం పెరిగినట్లు అయ్యింది...

Hello Telugu - Jio Shocking

Hello Telugu - Jio Shocking

Jio : భారతదేశపు అతిపెద్ద టెలికాం సేవల ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు మరోసారి నిరాశను మిగిల్చింది. ఇప్పటికే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో (Jio), తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రూ.799 ప్లాన్‌ను ‘మై జియో’ యాప్‌ నుంచి తొలగించింది. ఈ చర్యతో మధ్యతరగతి వినియోగదారులకు మళ్లీ ధరల భారం పెరిగినట్లు అయ్యింది.

Jio – రూ.799 ప్లాన్‌ తొలగింపు – వినియోగదారులకు ఝలక్

రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభించేవి. మొత్తంగా ఈ ప్లాన్ ద్వారా 126GB డేటా వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇదే ప్రయోజనాల కోసం వినియోగదారులు రూ.889 ప్లాన్‌ వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యామ్నాయంగా రూ.889, రూ.666 ప్లాన్లు

5G సేవలు – డేటా పరిమితులకు పరిమితం

ప్రస్తుతం జియో (Jio) 5G సేవలు కేవలం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్లకే పరిమితం చేసింది. అందువల్ల 1.5GB/Day ప్లాన్లకు 5G సదుపాయం అందుబాటులో ఉండదు. ఈ అంశంపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ధరల పెంపు వెనుక వ్యూహం ఏమిటి?

టెలికాం రంగంలో పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, టెలికాం సంస్థలు వరుసగా రీఛార్జ్ ధరలను పెంచుతున్నాయి. పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా, వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచే దిశగా జియో ఈ చర్యలకు పాల్పడుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూ.249, రూ.799 వంటి మధ్యస్థాయి ప్లాన్లను తొలగించడం దీని భాగంగానే చేపట్టిన చర్యగా పేర్కొంటున్నారు.

వినియోగదారుల కంట్లో ఆందోళన

ప్రభుత్వం నిబంధనలు సడలించిన తర్వాత ధరల పెంపు ఇది రెండో దఫా కావడంతో, వినియోగదారుల మధ్య అసంతృప్తి విస్తరిస్తోంది. తక్కువ ధరల్లో మెరుగైన సేవలు అందాలని కోరుకుంటున్న వినియోగదారులకు ప్రస్తుతం ఎంపికల పరిధి తగ్గినట్టు స్పష్టమవుతోంది.

Also Read : Hyderabad AI fraud scandal : భాగ్యనగరంలో ఏఐ టెక్నాలజీ పేరుతొ 850 కోట్ల భారీ మోసం

Exit mobile version