Hyderabad : సైబరాబాద్ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా ఎదురుదెరిగిన పోంజీ స్కీమ్ మోసం కేసులో ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గురు ప్రధాన నిందితులు—వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయాస్ పాల్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Hyderabad – నకిలీ కంపెనీలు, ఫేక్ వెబ్సైట్లతో మోసం
మాదాపూర్లో పలు నకిలీ కంపెనీలు, ఫేక్ వెబ్సైట్లు ఏర్పాటు చేసిన నిందితులు, అమాయక ప్రజలను నెలకు 7 శాతం, సంవత్సరానికి 84 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి ఆకట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వాస్తవానికి ఎలాంటి లావాదేవీలు లేకపోయినా, అది నిజమైన పెట్టుబడిగా చిత్రీకరించి, మొత్తం 3,164 మందిని మోసం చేసి రూ. 850 కోట్లు వసూలు చేశారు.
మనీలాండరింగ్, మ్యూల్ ఖాతాలు, విదేశీ లావాదేవీలు
నిందితులు వసూలు చేసిన డబ్బును 21 మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని దుబాయ్లో మనీలాండరింగ్ చేసారని EOW దర్యాప్తులో వెల్లడైంది. ఇంతటి భారీ మోసాన్ని పుప్పాలగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ద్వారా పోలీసులు గుర్తించారు. అతను రూ. 23 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Hyderabad – ప్రధాన నిందితుల వివరాలు
- వేణుగోపాల్ (ఆంధ్రప్రదేశ్) – మణికొండలో నివాసం ఉంటూ, “AV సొల్యూషన్స్” పేరిట నకిలీ కంపెనీ స్థాపించి, 2,388 మందిని మోసించి రూ. 442 కోట్లు కాజేశాడు.
- వెంకట్రావు – “IIT క్యాపిటల్ టెక్నాలజీ” పేరిట 778 మందిని మోసించి రూ. 410 కోట్లు వసూలు చేశాడు.
- శ్రేయాస్ పాల్ – టెక్నికల్ డెవలపర్గా, నకిలీ వెబ్సైట్లను అభివృద్ధి చేసి భారీ మోసానికి పాల్పడ్డాడు. అతడు “AV సొల్యూషన్స్”లో కీలక ఉద్యోగిగా ఉన్నట్లు గుర్తించారు.
Hyderabad – టెక్నాలజీ ఉపయోగించి మోసానికి తెరలేపిన నిందితులు
ఏపీ, తెలంగాణలో AI టెక్నాలజీ ఆధారంగా స్టాక్ మార్కెట్ పై సెమినార్లు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. టెక్నాలజీ, మార్కెటింగ్ మేళవించి ఫేక్ ట్రేడింగ్, నకిలీ లాభాల వలన ప్రజలను నమ్మించగలిగారు. నకిలీ వెబ్సైట్లు, అప్లికేషన్లు, ఫేక్ రిపోర్టులు ద్వారా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు.
విలువైన ఆస్తుల స్వాధీనం
సైబరాబాద్ పోలీసులు నిందితుల వద్ద నుంచి:
- విలువైన కార్లు,
- 11 ల్యాప్టాప్లు,
- 3 మొబైల్ ఫోన్లు,
- బాధితుల డేటాబేస్,
- బినామీ పేర్లలో ఉన్న ప్లాట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో 20 మందికి పైగా ఏజెంట్లు ప్రధాన నగరాల్లో వ్యవహరించినట్లు గుర్తించగా, వారి పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే, నిందితుల ఆస్తులపై కూడా పూర్తి వివరాలు సేకరించి జప్తు చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read : EPFO Important Decision : పీఎఫ్ ఖాతాదారులకు ఇకపై ఆ డబ్బులు డబుల్
