GST New Reforms : సామాన్యులపై భారం తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

2025 దీపావళి నాటికి ఈ సంస్కరణలు అమలులోకి రాబోతున్నాయని సంకేతాలిచ్చారు...

Hello Telugu - GST New Reforms

Hello Telugu - GST New Reforms

GST : దేశంలో పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసి ప్రజలపై పన్ను భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో “తదుపరి తరపు జీఎస్టీ (GST) సంస్కరణలు” అమలులోకి వచ్చే సూచనలు చేశారు. 2025 దీపావళి నాటికి ఈ సంస్కరణలు అమలులోకి రాబోతున్నాయని సంకేతాలిచ్చారు.

GST Key Updates

ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లు – 5%, 12%, 18%, 28% – కు బదులుగా, రెండే ప్రధాన స్లాబ్‌లు ఉండేలా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త విధానంలో:

ఈ మార్పులతో సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిత్యవసర వస్తువులపై పన్ను తగ్గిపోవడం వల్ల వాటి ధరలు తగ్గనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

GST – పన్ను తగ్గే అవకాశం ఉన్న వస్తువులు:

ప్రత్యేక పన్ను కొనసాగనుండే రంగాలు:

పొగాకు, సిగరెట్లు, ఎరేటెడ్ డ్రింక్స్, పాన్ మసాలా వంటి వాటిపై ప్రత్యేక అధిక పన్ను కొనసాగే అవకాశం ఉంది. బంగారం, వెండి, వజ్రాలపై తక్కువ ప్రత్యేక పన్ను రేటు కొనసాగవచ్చని భావిస్తున్నారు. మద్యం, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలకే కొనసాగనుంది.

Also Read : Central Govt Warning : వాట్సాప్ వెబ్ ను ఉపయోగించే వాళ్ళకి కేంద్రం కీలక హెచ్చిరిక

Exit mobile version