Central Govt Warning : వాట్సాప్ వెబ్ ను ఉపయోగించే వాళ్ళకి కేంద్రం కీలక హెచ్చిరిక

బ్రౌజర్ హైజాకింగ్ వంటి సైబర్ ముప్పులు ప్రమాదంగా మారవచ్చని ఆందోళన వ్యక్తమైంది...

Hello Telugu - Central Govt Warning

Hello Telugu - Central Govt Warning

Central Govt : వాణిజ్య, వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్న వాట్సాప్ (Whats App) — ఇప్పుడు వెబ్ వెర్షన్‌ ద్వారా కార్యాలయాలలోనూ వినియోగం పెరుగుతోంది. అయితే, వాట్సాప్ వెబ్ ఉపయోగంలో భద్రతాపరమైన అనేక ముప్పులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపిన వివరాల ప్రకారం, వాట్సాప్ వెబ్ ద్వారా వ్యక్తిగత గానీ, సంస్థలకు చెందిన ముఖ్యమైన సమాచారం గానీ లీక్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫారంపై స్క్రీన్ మానిటరింగ్, మాల్వేర్ ఇన్‌ఫెక్షన్, బ్రౌజర్ హైజాకింగ్ వంటి సైబర్ ముప్పులు ప్రమాదంగా మారవచ్చని ఆందోళన వ్యక్తమైంది.

Central Govt – పరిస్థితులు గమనించాల్సిన ముఖ్యాంశాలు

వినియోగదారులు ఆఫీస్ వైఫై లేదా పబ్లిక్ నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తున్న సమయంలో, వ్యక్తిగత డేటా కూడా సంస్థల దృష్టికి చేరే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదనంగా, వాట్సాప్ వెబ్ (Whats App) యాక్సెస్ ఉన్న పరికరం పోయినట్లయితే, అక్కడున్న చాట్‌లు, ఫైళ్లు వంటి సమాచారం అనధికారిక హస్తగతం కావడం ద్వారా డేటా లీక్‌కు దారితీయవచ్చని హెచ్చరికలలో పేర్కొనబడింది.

భద్రత కోసం తీసుకోవలసిన చర్యలు

సాంకేతిక నిపుణులు మరియు మంత్రిత్వ శాఖ సూచించిన ముందు జాగ్రత్తలు:

సైబర్ భద్రతకు ప్రాధాన్యత అవసరం

సాధారణ వినియోగదారులతో పాటు, కార్పొరేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, స్టార్ట్‌అప్ సంస్థలు వంటి వారు వాట్సాప్ వెబ్ వినియోగంలో అధిక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సైబర్ భద్రతా ప్రమాణాల పాటన ద్వారా మాత్రమే వ్యక్తిగత సమాచారం గానీ, వ్యాపార రహస్యాలు గానీ పరిరక్షించబడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, సాంకేతిక సౌకర్యాల వినియోగంలో జాగ్రత్తలు అవసరమని, సైబర్ భద్రతా ప్రమాణాలు అన్ని స్థాయిల్లో అమలులో ఉండాలని మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

Also Read : GST New Reforms : జీఎస్టీ సంస్కరణలపై మరో కీలక అప్డేట్

Exit mobile version