Gold : బంగారం, వెండి ధరలు మరోసారి ఊహించని రీతిలో పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం (Gold) ధర, తిరిగి ఊపందుకొని లక్ష మార్కును దాటింది. అదే విధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.
Gold – జూలై 22, 2025 (మంగళవారం) నాటి ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,140 పెరిగి ₹1,01,290కి చేరింది
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,050 పెరిగి ₹92,850గా ఉంది
వెండి ధర (1 కిలో): ₹2,000 పెరిగి ₹1,18,000కి చేరింది
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,01,290
22 క్యారెట్ల బంగారం: ₹92,850
వెండి ధర (1 కిలో): ₹1,28,000
విజయవాడ & విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం: ₹1,00,040
22 క్యారెట్ల బంగారం: ₹91,700
వెండి ధర: ₹1,28,000
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీ:
బంగారం (24 క్యారెట్లు): ₹1,01,440
బంగారం (22 క్యారెట్లు): ₹93,000
వెండి ధర: ₹1,18,000
ముంబై:
24 క్యారెట్లు: ₹1,01,290
22 క్యారెట్లు: ₹92,850
వెండి: ₹1,18,000
చెన్నై:
బంగారం (24 క్యారెట్లు): ₹1,01,290
బంగారం (22 క్యారెట్లు): ₹92,850
వెండి: ₹1,28,000
బెంగళూరు:
బంగారం (24 క్యారెట్లు): ₹1,01,290
బంగారం (22 క్యారెట్లు): ₹92,850
వెండి: ₹1,18,000
ధరల పెరుగుదలపై నిపుణుల అభిప్రాయాలు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఉత్కంఠభరిత పరిస్థితులు, డాలర్ మారకం విలువలో మార్పులు, ముద్రాస్ఫీతి భయాలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read : Gold Silver Price Today : ఈరోజు పసిడి మరియు వెండి రేట్లు ఇలా!
