చెన్నై : ఐపీఎల్ లో కీలకమైన జట్టుగా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. కొన్నేళ్ల పాటు ఆటగాడి నుంచి జట్టుకు హెడ్ కోచ్ గా విశిష్ట సేవలు అందిస్తూ వచ్చిన స్టీఫెన్ ఫ్లెమింగ్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం తను తమ జట్టు నుంచి వీడి పోతున్నట్లు తెలిపింది సీఎస్కే. ఈ మేరకు సోమవారం తమ అధికారిక సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది. స్పష్టమైన చర్చల తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్తో వీడనున్నారని పేర్కొంది. ఫ్లెమింగ్ మొదట 2008లో ఇండియన్ ప్రిమియర్ ప్రారంభ సీజన్లో ఆటగాడిగా జట్టులో చేరారు, ఆ తర్వాత 2009లో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు. గత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్కు చేరడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచింది సీఎస్కే జట్టు.
చెన్నై సూపర్ కింగ్స్ తమ దీర్ఘకాల ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో స్పష్టమైన , నిజాయితీతో కూడిన చర్చల అనంతరం విడిపోతున్నట్లు ప్రకటించింది. 2009లో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు. ఆట పరంగా చూస్తే పద్దెనిమిది ఏళ్లు అనేది ఒక సుదీర్ఘ కాలం, నేను కృతజ్ఞతా భావంతోనే నిష్క్రమిస్తున్నాను. చెన్నై సూపర్ కింగ్స్తో గడిపిన సమయం నా కోచింగ్ కెరీర్లో ఒక గొప్ప గౌరవం. మనం సాధించిన విజయాల పట్ల నాకు గర్వంగా ఉంది అని పేర్కొన్నాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. మేము కలిసి మరపురాని విజయాలను జరుపుకున్నాం, క్లిష్ట పరిస్థితులను అధిగమించాం. సీఎస్కే ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది, రాబోయే సంవత్సరాల్లో కూడా నేను జట్టుకు మద్దతుగా నిలుస్తాను అని తెలిపాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఈ జట్టు రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్లను కూడా గెలుచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్కు చేరుకుంది . 10 సార్లు ఫైనల్స్లో ఆడింది.


















