CM Chandrababu Interesting : గ‌డువు లోగా నీటి పారుద‌ల ప్రాజెక్టులు పూర్తి కావాలి

15న హంద్రీ నీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిప‌ల్లికి నీరు

Hello Telugu - CM Chandrababu Interesting

Hello Telugu - CM Chandrababu Interesting

CM Chandrababu : అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు సాగునీరు ఇచ్చేందుకు ఏడాది కాలంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం రూ.3,890 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టిందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం మేరకు 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. జీడిపల్లి నుంచి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లను ఈ నీటితో నింపాలని అన్నారు.

CM Chandrababu Interesting to Complete

అలాగే ఫేజ్-2 కాలువ ద్వారా పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు జూలై 31న నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. కాలువల విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా తొలిసారి సీమలోని వివిధ ప్రాంతాలకు సాగునీరు అందనుంద‌న్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటి విడుదల చేసి అక్కడ నుంచి 15 రోజుల పాటు పెన్నా ఆహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా విడుదలయ్యే 3,850 క్యూసెక్కుల నీటిని వినియోగించి రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులను నింపాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి జలవనరుల శాఖపై సమీక్ష చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, నీటి నిర్వహణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో నీటి నిర్వహణ చేసి ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చంద్ర‌బాబు నాయుడు. దీని కోసం పూర్తి స్థాయి ప్రణాళికతో ప్రభుత్వ శాఖలు, అధికారులు పని చేయాలన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుపై మరింత శ్రద్ధ తీసుకోవాలని, ఈ అంశంలో ఇరిగేషన్ శాఖతో పాటు పంచాయతీ రాజ్ శాఖను కూడా భాగస్వామిని చేయాలని ఆదేశించారు.

Also Read : BC Janardhan Reddy Sensational Comments : బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ఏపీలో గేమ్ ఛేంజ‌ర్

Exit mobile version