GST Council Strong Focus : జీఎస్టీ స్లాబుల త‌గ్గింపుపై కేంద్రం ఫోక‌స్

కీల‌క‌మైన జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం

Hello Telugu - GST Council Strong Focus

Hello Telugu - GST Council Strong Focus

GST : న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో కీల‌క‌మైన జీఎస్టీ (GST) కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. స్లాబ్‌ల సంఖ్యను కేవలం 5 శాతం, 18 శాతం కు తగ్గించడం, 12 శాతం, 28 శాతం స్లాబ్‌లను తొలగించడంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది. న్యూఢిల్లీలో జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ,రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ హాజ‌ర‌య్యారు. ఇది సామూహిక వినియోగ వస్తువులపై పన్ను రేట్లను తగ్గిస్తుంది, వస్త్రాలు వంటి రంగాలలో సుంకం విలోమాన్ని తొలగిస్తుంది . ఎంఎస్ఎంఈల‌కు సైతం వెసులుబాటు క‌లుగ‌నుంది. పొగాకు, అల్ట్రా-లగ్జరీ వస్తువులతో సహా కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం పన్ను ప్రతిపాదించబడింది.

GST Key Updates

కేంద్రం ప్రతిపాదించిన, రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలించిన విస్తృత రేటు మార్పు ప్రతిపాదన ప్రకారం, 12 శాతం ప‌రిధిలోకి వ‌చ్చే వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను రేటుకు మారుతాయి. అదేవిధంగా ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే సిమెంట్ వంటి ఇతర వస్తువులు 28 శాతం నుండి తక్కువ 18 శాతం శ్లాబుకు మారే 90 శాతం వస్తువులలో ఉండే ఛాన్స్ ఉంది. జిఎస్‌టి పునర్విభజన అమలు తర్వాత అన్ని రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన రాష్ట్రం కేంద్రం జిఎస్‌టి రేటు ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

ఒక కూటమి భాగస్వామిగా తాము కేంద్రం జిఎస్‌టి రేటు హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నామన్నారు. ఇది సామాన్యులకు అనుకూలంగా ఉంద‌న్నారు కేశవ్ కౌన్సిల్ సమావేశానికి ముందు చెప్పారు.

Also Read : Donald Trump Shocking Comments : భార‌త‌దేశంపై సుంకాల విధింపు స‌బ‌బే

Exit mobile version