త్వరలోనే మంత్రివర్గ శాఖల కేటాయింపు

ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర ప్ర‌క‌ట‌న

hellotellugu-GParameshwara

బెంగళూరు : మంత్రివర్గంలో కొత్తగా చేరిన వారికి శాఖల కేటాయింపు విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు ఉప ముఖ్య‌మంత్రి జి ప‌ర‌మేశ్వ‌ర‌. ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆయ‌న‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఢిల్లీ వెళ్లారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత శాఖల కేటాయింపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళం లేదు, అధిష్టానంతో చర్చించిన తర్వాతే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లారు, ఈ రోజే తిరిగి వస్తున్నారు. ఆయన వచ్చాక ప్రకటన చేస్తారని నేను భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు శాఖలు కేటాయిస్తే రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మంత్రులకు ఇబ్బందిగా ఉండదా అని అడిగినప్పుడు, వారంతా సమర్థులని, వారికి సహాయపడే సీనియర్లు ఉంటారన్నారు జి. ప‌ర‌మేశ్వ‌ర‌.

కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని ఆయన అన్నారు. కొత్తగా మంత్రులైన వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ వారికి విషయాలను వివరించడానికి అధికారులు ఉంటారని తెలిపారు. కాలక్రమేణా వారు విషయాలు నేర్చుకుంటారు. తాము కొత్త మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామ‌న పేర్కొన్నారు జి. ప‌ర‌మేశ్వ‌ర‌. పరిపాలనపై అవగాహన వచ్చాక అంతా సవ్యంగా సాగుతుందన్నారు. . వారు ఇప్పటికే శాసనసభ్యులుగా ఉన్నందున, ఈ విషయాలు వారికి కొత్తేమీ కాదు అని ఆయన జోడించారు. ఆగస్టు 3న మంత్రివర్గంలో చేరిన 19 మంది కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై డీకే శివ‌కుమ‌మార్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ సమయంలో అవకాశం దక్కని సీనియర్ నాయకులు .

Exit mobile version