YS Jagan : అమరావతి – మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి అక్రమ ఓటర్ల ద్వారా, ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయడం ద్వారా గెలుపొందారని సంచలన ఆరోపణలు చేశారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. జెడ్పిటిసి ఉప ఎన్నికలను చంద్రబాబు నాయుడు ‘హైజాక్’ చేశారని ఆరోపించారు. చివరికి, ధర్మం గెలుస్తుందని మాజీ సీఎం మండిపడ్డారు. ఇదిలా ఉండగా కడప జిల్లాలోని పులివెందుల , ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు మరింత రాజకీయ వేడి నెలకొంది.
YS Jagan Slams CM Chandrababu
ఈ రెండింటిలో ఎలాగైనా గెలుపొందేందుకు కుట్రలకు తెర లేపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డి. ఈ రెండు స్థానాలకు ఆగస్టు 12న మంగళవారం పోలింగ్ జరగనుంది. జగన్ రెడ్డి (YS Jagan) చంద్రబాబు నాయుడును ఒక అప్రజాస్వామిక, అరాచక వ్యక్తిగా అభివర్ణించారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి బదులుగా, అధికారాన్ని చేజిక్కించు కోవడానికి కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు, అబద్ధాలు, మోసం మరియు వెన్నుపోట్లు ఆశ్రయిస్తాడని ఆరోపించారు. ఉప ఎన్నికల రెండు నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి అధికార టీడీపీ ఒక ప్రణాళికను రూపొందించిందని ఆయన ఆరోపించారు.
తన ఆరోపణలకు మద్దతుగా జగన్ వరుస సంఘటనలను ప్రస్తావించారు. ముందస్తు నేర చరిత్ర లేనివారితో సహా వందలాది మంది కార్యకర్తలను ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బంధించారని మండిపడ్డారు . దాడి చేసిన వారిని అరెస్టు చేయడానికి బదులుగా పోలీసులు వేల్పుల రాము, 50 మందిపై తప్పుడు SC/ST కేసు నమోదు చేశారని, అనేక మందిని అరెస్టు చేశారని, పోలింగ్ రోజున మరిన్ని నిర్బంధాలకు ప్రణాళికలు వేస్తున్నారని జగన్ ఆరోపించారు.
Also Read : Rahul Gandhi Fired on EC : ఈసీ నిర్వాకంపై రాహుల్ గాంధీ ఆందోళన
