WPI Inflation దేశంలోని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 0.13%కి తగ్గిందని ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14, 2025) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని తెలిపారు.
పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రకటనలో, “సెప్టెంబర్ 2025లో సానుకూల ద్రవ్యోల్బణ రేటు ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, నాన్-ఫుడ్ ఆర్టికల్స్, టెక్స్టైల్స్, రవాణా పరికరాలు వంటి విభాగాల్లో ధరల పెరుగుదల వల్ల ఏర్పడింది” అని పేర్కొంది.
WPI Inflation – ప్రధాన వివరాలు:
- ఆహార పదార్థాల విభాగంలో ద్రవ్యపతనం (deflation) 5.22% గా నమోదైంది (ఆగస్టులో 3.06%)
- కూరగాయల ధరలు 24.41% తగ్గాయి (ఆగస్టులో 14.18%)
- తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.33%, ఆగస్టులో ఇది 2.55%
- ఇంధనం మరియు విద్యుత్ విభాగంలో 2.58% నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదైంది (ఆగస్టులో 3.17%)
- ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన కీలక వడ్డీ రేట్లను 5.5% వద్ద స్థిరంగా ఉంచింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్లో 8 సంవత్సరాల కనిష్ఠ స్థాయి 1.5% కి పడిపోయిందని ప్రభుత్వం సోమవారం (అక్టోబర్ 13, 2025) వెల్లడించింది.
Also Read : Stock Market Growth : వాణిజ్య ఆశలతో మార్కెట్ల ర్యాలీ – ఐటీ స్టాక్స్ లీడ్!
