బెంగళూరు : ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ సీఎం అయ్యాడని, కర్ణాటకలో సంచలన నటుడు ఉపేంద్ర కుమార్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని ప్రశ్నించారు. తాజాగా నటుడు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తను ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాహ్నవి కపూర్ తో కలిసి ముఖ్య పాత్ర పోషించారు పెద్ది సినిమాలో. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చారు శివ రాజ్ కుమార్. కర్ణాటక ప్రజల నుంచి ఉపేంద్రకు ఎందుకు అలాంటి మద్దతు లభించ లేదని ప్రశ్నించారు. మీడియా దృష్టిని ఆకర్షించకుండా తమ కుటుంబం ప్రజలకు సేవ చేస్తుందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో చేరడంపై తనకు వ్యక్తిగత ఆసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత చర్చ తోటి నటుడు ఉపేంద్ర వైపు మళ్లింది. ఉపేంద్ర చురుకుగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచనకు శివరాజ్కుమార్ మద్దతు తెలిపారు.
తమిళనాడులో నటుడు విజయ్ ఇటీవల సాధించిన రాజకీయ విజయాన్ని ఆయన ఉదహరించారు. భారీ విజయం సాధించడానికి విజయ్కు ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించిందన్నారు. కర్ణాటక ప్రజల నుంచి ఉపేంద్రకు ఎందుకు అలాంటి మద్దతు లభించ లేదో అర్థం కావడం లేదన్నారు. నటులు సినిమాల కోసం మాత్రమే మేకప్ వేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. నిజ జీవితంలో, వారు రంగులు మార్చుకోరు లేదా వారి నిజమైన ఉద్దేశాలను దాచుకోరన్నారు. వారు తెరపై అలంకరణ చేసుకున్నప్పటికీ, వారి ప్రజా సేవ స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటుందని శివ రాజ్కుమార్ నొక్కి చెప్పారు. నిజమైన మంచి పనికి ఎల్లప్పుడూ ప్రచారం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజాయితీని గుర్తించే స్థితిలో ఉన్నారన్నారు. వారి హృదయాలే దాని గురించి మాట్లాడతాయి. విజయ్ రాజకీయ ప్రస్థానం, స్ఫూర్తిదాయక ప్రసంగాల పట్ల శివ రాజ్కుమార్ గొప్ప ఆనందాన్ని వ్యక్తం చేశారు.



















