CM Chandrababu : విశాఖపట్నం : కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో నిర్మించనున్న డ్రోన్ సిటీకి, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటుకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులు కీలకం కానున్నాయని ఈ సందర్బంగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలిచేలా చేస్తామన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సును నిర్వహించడం జరిగిందని చెప్పారు.
CM Chandrababu Comments
ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు సీఎం. ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ వికసిత్ భారత్ దిశగా ఏపీ కూడా అడుగులు వేస్తోందని చెప్పారు. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు సైతం ఏపీతో ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు టీ జీ భారత్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు.
Also Read : AP-Japan Important Agreement : ఏపీ సర్కార్ తో జపాన్ కీలక ఒప్పందం
















