Gold : దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో తలెత్తుతున్న అస్థిరత, పారిశ్రామిక అవసరాల పెరుగుదల కారణంగా ఈ ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బుధవారం నాడు ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు ₹1,18,000గా నమోదవగా, 24 క్యారెట్ల బంగారం (Gold) ధర 10 గ్రాములకు ₹1,02,330కి ఎగబాకింది.
Gold – బంగారం ధరల తారస్థాయికి చేరిక:
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఒకేరోజు ₹1,040 పెరిగి 10 గ్రాములకు ₹1,02,330కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో ఇదే బంగారం ధర ₹1,01,290గా ఉండగా, ఈ పెరుగుదల పట్ల మార్కెట్ నిపుణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.950 పెరిగి 10 గ్రాములకు ₹93,800కు చేరింది.
వెండి ధరల్లో బలమైన ఊతం:
వెండి ధరలు కూడా అదే ధోరణిలో కిలోకు ₹1,18,000కు చేరాయి. స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లకు గణనీయంగా పెరుగుతున్న స్పందన ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి.
ధరల పెరుగుదల వెనుక కారణాలు:
నిపుణుల అంచనాల ప్రకారం, ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనంగా మారడం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత, గ్లోబల్ ద్రవ్యోల్బణం భయాలు, తక్కువ వడ్డీ రేట్ల పరిస్థితులు — ఇవన్నీ విలువైన లోహాలపై డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా ధరల పెరుగుదలపై కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో ధరల అంచనా:
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోల్డ్ రేటు తులం ₹1,10,000 మార్కును అధిగమించే అవకాశముందని అంచనా. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, వెండి ధర కూడా మరోసారి ₹1,25,000 వద్దకు చేరే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
Also Read : Today Gold Price : శ్రావణమాసం వేల షాకిచ్చిన పసిడి ధరలు
