కోల్ కతా : కేంద్ర సర్కార్ పై, భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయానీ ఘోష్. ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ ఆధ్వర్యంలో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బరుయ్పూర్ పుర్బోలో సాగర్ సంఘ మైదానంలో తన మొదటి ప్రచార సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ కీలక సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ సయానీ ఘోష్. ఈ సందర్బంగా ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీని బలహీన పర్చేందుకు కేంద్రంలోని కొందరు కావాలని కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. అయినా వాటన్నింటిని తట్టుకుని నిలబడతామని స్పష్టం చేశారు.
ఈ ప్రచారానికి వచ్చిన జనాన్ని చూస్తుంటే మరోసారి పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ జెండా ఎగుర వేయడం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ. ఇది ఒక శక్తివంతమైన ప్రారంభాన్ని నమోదు చేసిందన్నారు. ధైర్యం, దృఢ సంకల్పం, పోరాట స్ఫూర్తితో ఉన్నతంగా నిలిచే నిజమైన నీలిరంగు నాయకుడిపై బెంగాల్ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని ఈ భారీ పోలింగ్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఆయన సందేశం స్పష్టంగా, దృఢంగా ఉందన్నారు. బంగ్లాను అవమానించే, దాని గర్వాన్ని దెబ్బతీసే శక్తులను తరిమి కొట్టడానికి బెంగాల్ తప్పకుండా ఎదుర్కొని తీరుతుందన్నారు ఎంపీ. ఈ నిర్ణయాత్మక ఎన్నికల ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆయన బరుయ్పూర్ పుర్బో , సౌత్ 24 పరగణాలను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.


















