Tesla New Innovation : ఇండియాలో మొట్టమొదటి షోరూమ్ ఓపెన్ చేసిన ‘టెస్లా’

ఈ షోరూమ్ ప్రారంభంతో భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రారంభమైనట్లయ్యాయి...

Hello Telugu - Tesla New Innovation

Hello Telugu - Tesla New Innovation

Tesla : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం ఉదయం ముంబై నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తొలి షోరూమ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ షోరూమ్ ప్రారంభంతో భారత్‌లో టెస్లా (Tesla) ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రారంభమైనట్లయ్యాయి.

ప్రస్తుతం ఈ షోరూమ్‌లో టెస్లా వై మోడల్ కార్లు మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్‌లో రెండు వేరియంట్లు — లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ (RWD), లాంగ్ రేంజ్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లు మాత్రమే ఉన్నాయి.

Tesla – ధరల వివరాలు:

వై మోడల్ RWD వేరియంట్ ధర ₹59.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధరకు ప్రధాన కారణం విదేశీ కార్లపై భారత్ విధిస్తున్న అధిక దిగుమతి సుంకాలే. ప్రస్తుతం భారత్ విదేశీ కార్లపై 70 శాతం నుండి 100 శాతం వరకు దిగుమతి పన్నులు విధిస్తోంది.

ఎలన్ మస్క్ vs భారత ప్రభుత్వం:

భారత్‌లో టెస్లా కార్ల ధరలు తగ్గాలంటే దిగుమతి పన్నులు తగ్గించాల్సిందేనని ఎలన్ మస్క్ గతంలోనే సూచించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగుమతి పన్నుల విషయంలో వెనకడుగు వేయలేదు. భారత్ మార్కెట్లోకి రాలంటే టెస్లా ఇక్కడే తయారీ యూనిట్ పెట్టుకోవాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి.

భవిష్యత్ దిశ:

ప్రస్తుతం టెస్లా–భారత ప్రభుత్వం మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మస్క్ భారత్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారో లేదో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇందుకు తోడు, భారత్ వంటి పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టెస్లా ప్రాతినిధ్యం పెరగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ముంబై షోరూమ్ ప్రారంభం… టెస్లా భారత్ ప్రయాణానికి తొలి మెట్టు మాత్రమే.

Also Read : Petrol and Diesel Price Alarming : వాహనదారులకు చక్కటి శుభవార్త..తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

Exit mobile version