Stock Market Pump and Dump Scam : స్టాక్ మార్కెట్ లో ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ తో భారీగా నష్టం

ఈ కేసుతో పాటు “పంప్ అండ్ డంప్” అనే మోసపు విధానంపై మరోసారి దృష్టి పడింది...

Hello Telugu - Stock Market Pump and Dump Scam

Hello Telugu - Stock Market Pump and Dump Scam

Stock Market : ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మారుతున్న ధోరణిలో, ఆర్థిక మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన గ్లోబల్ ఆల్గో ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ (Jane Street) పై భారీ స్కామ్ ఆరోపణలు తలెత్తాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్ పేరుతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను మోసపూరితంగా దోచుకున్నట్టుగా సమాచారం. ఈ కేసుతో పాటు “పంప్ అండ్ డంప్” అనే మోసపు విధానంపై మరోసారి దృష్టి పడింది.

Stock Market – పంప్ అండ్ డంప్ స్కామ్ అంటే ఏమిటి?

పంప్ అండ్ డంప్ (Pump and Dump) అనేది స్టాక్ మార్కెట్‌లో (Stock Market) పాతకాలంగా కొనసాగుతున్న ఒక మోసపూరిత పద్ధతి. ఇందులో స్కామర్లు తక్కువ ధరలో ఉండే స్టాక్స్ (పెన్నీ స్టాక్స్) ను టార్గెట్ చేస్తారు. మొదట పెద్ద మొత్తంలో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేసి, ధరను కృత్రిమంగా పెంచుతారు. ఆ తర్వాత, సోషల్ మీడియా వేదికలు — వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మొదలైన వాటిలో స్టాక్ ధర భారీగా పెరుగుతుందనే తప్పుడు ప్రచారం చేస్తారు.

ఈ ప్రచారానికి ఆకర్షితులైన చిన్న పెట్టుబడిదారులు ఆ స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు. కొంతకాలంలో ధర గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత, స్కామర్లు తమ స్టాక్స్‌ను విక్రయించి మార్కెట్ నుంచి నిష్క్రమిస్తారు. దీంతో స్టాక్ ధర అకస్మాత్తుగా పడిపోతుంది. ఫలితంగా, ఆ స్టాక్‌ను గరిష్ట ధర వద్ద కొనుగోలు చేసిన చిన్న పెట్టుబడిదారులు భారీ నష్టాన్ని చవిచూస్తారు.

ఉదాహరణగా ఎలా జరుగుతుంది?

ఒక కంపెనీ షేరు ధర రూ.2గా ఉన్నదని ఊహించుకోండి. స్కామర్లు లక్షల షేర్లను కొనుగోలు చేసి, సోషల్ మీడియా ద్వారా “ఈ స్టాక్ రూ.20 వరకు పెరుగుతుంది” అనే వదంతులు పెడతారు. దీన్ని నమ్మిన పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. షేరు ధర రూ.5 నుండి రూ.20 వరకు పెరిగే వరకూ స్కామర్లు వేచిచూస్తారు. ఆ సమయంలో వారంతా షేర్లను విక్రయించి లాభంతో బయటకు వచ్చేస్తారు. వారితోపాటే స్టాక్ ధర మళ్లీ రూ.2కు పడిపోతుంది. ఇలా సామాన్య పెట్టుబడిదారులు తమ డబ్బును కోల్పోతారు.

ఈ మోసం నుంచి ఎలా కాపాడుకోవాలి?

పరిశీలన తప్పనిసరి: ఎలాంటి స్టాక్‌లో పెట్టుబడి పెట్టేముందు, సంబంధిత కంపెనీ ఆర్థిక స్థితి, మేనేజ్‌మెంట్ మరియు భవిష్యత్తు వ్యూహాలపై పరిశోధన చేయండి.

సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దు: వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు మొదలైన వాటిలో వచ్చే “టిప్స్” ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవద్దు.

అధికారిక సలహాదారుల సహాయం తీసుకోండి: SEBIకి రిజిస్టర్డ్ అయిన ఆర్థిక సలహాదారుల సేవలు వినియోగించండి.

విభిన్న పెట్టుబడి విధానం: మొత్తం డబ్బును ఒకే స్టాక్‌లో పెట్టకుండా, వివిధ రంగాల్లో పెట్టుబడి విభజించండి.

Also Read : Indian Stock Market Shocking : కుదేలైన భారతీయ స్టాక్ మార్కెట్..25000 దిగువకు నిఫ్టీ

Exit mobile version