Stock Market Crash Shocking : సెన్సెక్స్ 560 పాయింట్ల నష్టంతో పతనమైన స్టాక్ మార్కెట్

ఒప్పందాలు ఉండవని చెప్పడం, మార్కెట్‌లో తీవ్ర ఆందోళనను కలిగించింది...

Hello Telugu - Stock Market Crash Shocking

Hello Telugu - Stock Market Crash Shocking

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు తీవ్రమైన నష్టాలను నమోదు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య చర్చలకు అనుకూలంగా లేరు అనే ప్రకటన, టారిఫ్ వివాద పరిష్కారానికి ముందు ఎలాంటి ఒప్పందాలు ఉండవని చెప్పడం, మార్కెట్‌లో తీవ్ర ఆందోళనను కలిగించింది.

ఈ ప్రకటనల ప్రభావంతో ఉదయం 11 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు నష్టపోయి 80,063 స్థాయికి చేరగా, నిఫ్టీ 50 సూచీ 186.6 పాయింట్లు పడిపోయి 24,409.55 వద్ద ట్రేడైంది. మార్కెట్‌లో ఈ నష్టాల కారణంగా మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల విలువను కోల్పోయారు.

Stock Market – టాప్ నష్టదాయకులు – లాభదాయకులు

సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ప్రధాన నష్టదాయక స్టాక్స్‌గా నిలిచాయి. మరోవైపు టైటాన్, NTPC, ITC, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ కొంత మేర లాభాల్లో ట్రేడయ్యాయి.

విభాగాల ప్రకారం పరిస్థితి

నిఫ్టీ రియల్టీ, మెటల్ సెక్టార్లు 1% కంటే అధికంగా పడిపోయాయి.

ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి విభాగాలన్నీ నష్టాల్లో ఉన్నాయి.

అయితే నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, మీడియా విభాగాలు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి.

నష్టాల మధ్యలో NSDL షేర్ల ఔజస్సు

స్టాక్ మార్కెట్ (Stock Market) నష్టాలతో ఊగిసలాడుతున్న సమయంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) షేర్లు అంచనాలను మించి ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు NSDL షేర్ ధర దాదాపు 16 శాతం పెరిగింది. మార్కెట్‌లో లాంచ్ అయిన మూడో రోజైనా కూడా లాభాల ఊపే కొనసాగింది. IPO ధరతో పోలిస్తే NSDL షేర్లు ఇప్పటికే 62 శాతం పెరిగాయి. మొదటి మూడు రోజుల్లో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 25,000 కోట్లకు మించి చేరింది.

తొలి త్రైమాసిక ఫలితాల ప్రభావం

ఈ రోజు పలు ప్రముఖ సంస్థలు తమ Q1 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. వాటిలో:

ఈ కంపెనీల ఫలితాలు మార్కెట్‌పై మరింత ప్రభావం చూపనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పేజ్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం

పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు 3.77 శాతం నష్టపోయి ఒక్కో షేరు రూ. 44,000 వద్ద ట్రేడయ్యాయి. జూన్ 30, 2025తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 3.1 శాతం పెరిగి రూ. 1,316.6 కోట్లు కాగా, వాల్యూమ్ గ్రోత్ కేవలం 1.9 శాతం మాత్రమే. బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొందరు కొనుగోలు సిఫార్సు చేస్తే, మరికొందరు హోల్డ్ సూచన ఇచ్చారు.

Also Read : Donald Trump Shocking Comments : అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version