Stock Market : గత వారం భారీ నష్టాలను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో స్వల్ప ఉత్సాహాన్ని ప్రదర్శించాయి. సోమవారం ఉదయం సానుకూల ధోరణితో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగిసిపోయినా, ఆ లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. మదుపర్ల లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల (Stock Market) ప్రతికూల సంకేతాల కారణంగా సూచీలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
Stock Market – మార్కెట్ స్థితి (ఉదయం 11:30 గంటల సమయానికి):
- సెన్సెక్స్: 23 పాయింట్ల లాభంతో 80,449 వద్ద
- నిఫ్టీ: 13 పాయింట్ల లాభంతో 24,668 వద్ద
లాభాల్లో ఉన్న షేర్లు:
సెన్సెక్స్లో సమ్మన్ క్యాపిటల్, బీపీసీఎల్, బీఎస్ఈ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రో, ఐనాక్స్ విండ్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు:
డిక్సన్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, కేన్స్ టెక్నాలజీస్, మాజగాన్ డాక్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల బాట పట్టాయి.
ఇతర సూచీలు:
- నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్: 63 పాయింట్ల లాభంలో
- బ్యాంక్ నిఫ్టీ: 10 పాయింట్ల స్వల్ప నష్టంలో
- రూపాయి-డాలర్ మారకం విలువ: 1 డాలర్ = ₹88.74
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ అనిశ్చితులు, వాణిజ్య సుంకాల ప్రభావం, రూపాయి బలహీనత మార్కెట్లపై ఒత్తిడి కొనసాగించవచ్చని, తక్షణ కాలంలో సూచీలు పరిమిత ఒడిదుడుకుల్లోనే కదలిక చూపే అవకాశం ఉందని అంచనా.
Also Read : LPG Gas – New Innovation : ఎల్పీజీ మార్పిడి సౌకర్యం – వినియోగదారులకు కొత్త అవకాశాలు!
