Stock Market : అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఊహించినట్టుగానే వడ్డీ రేట్లలో కోత విధించడంతో పాటు భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై వచ్చిన సానుకూల వార్తలు దేశీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఇప్పటికే మంగళవారం, బుధవారం లాభాలను నమోదు చేసిన సూచీలు గురువారం కూడా అదే జోరును కొనసాగించాయి.
Stock Market – సెన్సెక్స్ – నిఫ్టీ బలమైన ముగింపు
బుధవారం 82,693 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయం 400 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదిలి 82,704 – 83,141 శ్రేణిలో ఊగిసలాడింది. చివరకు 320 పాయింట్లు ఎగబాకి 83,013 వద్ద స్థిరపడింది. దీతో చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ మళ్లీ 83,000 మార్క్ పైకి చేరుకుంది.
నిఫ్టీ కూడా అదే బాటలో కదిలి 93 పాయింట్ల లాభంతో 25,423 వద్ద రోజు ముగిసింది.
లాభపడ్డ – నష్టపడ్డ షేర్లు
- లాభాల్లో: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ఎఫ్సీఎల్, బయోకాన్, లారస్ ల్యాబ్స్, గ్లెన్మార్క్.
- నష్టాల్లో: పేజ్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, టాటా కెమికల్స్, కల్యాణ్ జువెల్లర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్.
ఇతర సూచీలు
- నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్: 224 పాయింట్ల లాభం.
- బ్యాంక్ నిఫ్టీ: 234 పాయింట్లు ఎగబాకింది.
- రూపాయి మారకం విలువ: డాలర్తో పోలిస్తే 88.13గా నమోదైంది.
నిపుణుల విశ్లేషణ
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ కోత పెట్టుబడిదారులలో కొత్త ఉత్సాహం తెచ్చిందని, అలాగే భారత్–అమెరికా వాణిజ్య చర్చలు విజయవంతంగా ముందుకు సాగుతాయనే అంచనాలు మార్కెట్లకు (Stock Market) మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.
Also Read : Today Gold Price : నేడు గందరగోళంగా మారిన పసిడి ధరలు
