Stock Market Growth : 4వ రోజు లాభాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలలో బలమైన కొనుగోళ్లు సూచీలను పైకి లాగుతున్నాయి.

Hello Telugu - Stock Market Growth

Hello Telugu - Stock Market Growth

Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల దిశలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు ఎగబాకడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నింపింది. దేశీయ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలలో బలమైన కొనుగోళ్లు సూచీలను పైకి లాగుతున్నాయి.

విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగించినప్పటికీ, నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని తాకడం విశేషంగా మారింది. మరోవైపు మార్కెట్లో (Stock Market) ఐపీవో జోష్‌ కొనసాగుతుండటంతో సూచీలకు అదనపు ఉత్సాహం లభిస్తోంది.

Stock Market – సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో

సోమవారం ముగింపు స్థాయి (81,790)తో పోలిస్తే మంగళవారం ఉదయం 70 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభమైంది. అనంతరం మరింత బలపడి ఉదయం 10:15 గంటల సమయంలో 344 పాయింట్లు పెరిగి 82,134 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 82 వేల మార్క్‌ను తాకింది.

అదే సమయంలో నిఫ్టీ కూడా సానుకూల ధోరణిలో ఉంది. ప్రస్తుతానికి అది 100 పాయింట్ల లాభంతో 25,177 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో, నష్టాల్లో ఉన్న షేర్లు

సెన్సెక్స్‌లో సీడీఎస్‌ఎల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, పీబీ ఫిన్‌టెక్‌, జియో ఫైనాన్షియల్‌, పెట్రోనాట్‌ ఎల్‌ఎన్‌జీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు ట్రెంట్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టీసీఎస్‌ షేర్లు స్వల్ప నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 162 పాయింట్లు ఎగబాకగా, బ్యాంక్‌ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 88.73 వద్ద స్థిరంగా ఉంది.

మొత్తం మీద దేశీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనగా, నిపుణులు సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగితే సూచీలు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : ONGC Huge Investment : ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న ‘ఓఎన్జిసి’

Exit mobile version