Rahul Gandhi : ఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సీరియస్ కామెంట్స్ చేశారు. లడఖ్ లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. ఇప్పటికే పర్యావరణ కార్యకర్త సోనుమ్ వాంగు చుక్ ను కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తనను జైలులో ఉంచారు. లడఖ్లో జరిగిన ఈ హత్యలపై నిష్పాక్షిక న్యాయ విచారణ నిర్వహించాలని, దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లడఖ్ ప్రజలను ద్రోహం చేశారని ఆరోపించారు. కేంద్ర భూభాగంలో పోలీసు కాల్పుల్లో నలుగురు నిరసనకారుల మరణంపై నిష్పాక్షిక న్యాయ విచారణ జరపాలని అన్నారు.
Rahul Gandhi Demands
బుధవారం లడఖ్లో మరణించిన వారిలో కార్గిల్ యుద్ధ అనుభవజ్ఞుడు త్సేవాంగ్ థార్చిన్ కూడా ఉన్నారు. దక్షిణ అమెరికాలో నాలుగు దేశాల పర్యటనలో ఉన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, తార్చిన్ తండ్రి వీడియోను షేర్ చేశారు. తండ్రి సైన్యంలో, కొడుకు సైన్యంలో – దేశభక్తి వారి రక్తంలో ప్రవహిస్తుంది. అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఈ ధైర్యవంతుడైన దేశ కుమారుడిని కాల్చి చంపిందని ఆవేద వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఎందుకంటే అతను లడఖ్ ప్రజల హక్కుల కోసం నిలబడి ఉన్నాడని అన్నారు. ఈ రోజు దేశానికి సేవ చేసినందుకు లభించిన ప్రతిఫలం ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కావాలని లడఖ్ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ.
Also Read : Jagadish Reddy Fired on Congress : కాంగ్రెస్ ప్రజా పాలన బక్వాస్ : జగదీశ్ రెడ్డి
