PM Modi New Innovation : నవీ ముంబైలో తొలి డిజిటల్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని

ముందుగా మోదీ కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో దిగారు.

Hello Telugu - PM Modi New Innovation

Hello Telugu - PM Modi New Innovation

PM Modi : దేశ అభివృద్ధి దిశగా మరో మహత్తర మైలురాయిగా నిలిచింది నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం. బుధవారం (అక్టోబర్ 9) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీనిని అధికారికంగా ప్రారంభించారు. ముందుగా మోదీ కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో దిగారు.

PM Modi – చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌ భారం తగ్గనుంది:

నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక, ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా ఆటోమేటెడ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది భారత్‌లో తొలి డిజిటల్‌ ఎయిర్‌పోర్ట్‌‌గా గుర్తింపు పొందింది.

భారీ స్థాయిలో ప్రారంభోత్సవం:

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. రూ. 19,650 కోట్ల వ్యయంతో నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ తొలి దశను పూర్తి చేశారు. 2016లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ, ఎనిమిదేళ్ల తర్వాత దానిని ప్రారంభించడం విశేషం.

ప్రధాని మోదీ పర్యటన:

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ (PM Modi) టెర్మినల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆధునిక డిజైన్‌, ప్రయాణీకుల సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగ పిల్లలు భారత జెండాలు ఊపుతూ ప్రధానికి స్వాగతం పలికారు. పుష్పాలు చల్లి, హర్షాతిరేకంగా ఆతిథ్యం ఇచ్చారు.

కమలం ఆకారపు అద్భుత నిర్మాణం:

ప్రపంచప్రసిద్ధ జహా హదీద్ ఆర్కిటెక్ట్స్ రూపకల్పనలో రూపొందిన ఈ టెర్మినల్‌ కమలం ఆకారంలో ఉండటం ప్రత్యేకత. భారత జాతీయ పుష్పాన్ని ప్రతిబింబించే ఈ నిర్మాణం స్వచ్ఛత, పెరుగుదల, స్థితిస్థాపకతకు చిహ్నంగా నిలుస్తోంది. టెర్మినల్‌లోని స్తంభాలు వికసించిన కమలం రేకులను పోలి ఉండి దానికి ఆభరణంలా మెరుపు జోడిస్తున్నాయి.

భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌:

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ కింద అభివృద్ధి చేసిన NMIA, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ ప్రాజెక్ట్‌‌. ఆధునిక మౌలిక సదుపాయాలకు కొత్త ప్రమాణాలు సృష్టించింది.

భారీ సామర్థ్యంతో ముందుకు:

మొదటి దశలో ఈ ఎయిర్‌పోర్ట్‌ సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణీకుల రాకపోకలను నిర్వహించగలదు. పూర్తయిన తర్వాత నాలుగు టెర్మినల్స్‌, రెండు సమాంతర రన్‌వేలు కలిగి ఏటా 90 మిలియన్‌ ప్రయాణీకులను, 3.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటుంది.

ముంబైకి కొత్త హబ్‌:

నావీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభంతో ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం భారతదేశంలో తొలి డ్యూయల్‌-ఎయిర్‌పోర్ట్‌ హబ్‌‌గా అవతరించింది. ఈ కొత్త సౌకర్యం భారతీయ విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందనే అభిప్రాయం నిపుణులది.

Also Read : Silver Price Growth : భారీగా పెరిగిన వెండి ధరలు

Exit mobile version