PAK vs SL : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) మెగా టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు సత్తా చాటింది. దాయాది భారత జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడి పోయింది. స్వదేశంలో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ తరుణంలో జట్టు అంతా కలిసికట్టుగా ఆడింది. శ్రీలంక జట్టుపై విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇంకా రెండు ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది పాకిస్తాన్. 134 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ మొదట ఐదు ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 45 పరుగులు చేంది.
PAK vs SL Asia Cup 2025 Updates
తరువాతి ఏడు ఓవర్లలో ఐదు వికెట్లకు 80 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ తో పాటు మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరు 32 రన్స్ ఒకరు చేయగా మరొకరు 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలించారు. అంతకు ముందు మ్యాచ్ లో భాగంగా శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. కమిందు మెండిస్ 44 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కానీ పాకిస్తాన్ శ్రీలంక బ్యాట్స్మెన్పై గట్టి పట్టును కొనసాగించింది. షహీన్ షా అఫ్రిది 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. పేసర్ తలాత్ రెండు బంతుల్లో రెండు బంతులు కొట్టడంతో శ్రీలంక ఒక దశలో ఆరు వికెట్లకు 80 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేయగా పాకిస్తాన్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది.
Also Read : Smita Sabharwal Sensational : హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
