FM Nirmala Sitharaman Important Update : స్థిరకాయిన్స్‌తో దేశాలు తప్పనిసరిగా మమేకం కావాల్సిందే

స్వాగతించినా, వ్యతిరేకించినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి” అని అన్నారు.

Hello Telugu - FM Nirmala Sitharaman Important Update

Hello Telugu - FM Nirmala Sitharaman Important Update

Nirmala Sitharaman : భారత క్రిప్టోకరెన్సీ విధానంలో మార్పులకు సంకేతాలిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 3వ తేదీ (శుక్రవారం) కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ, “స్థిరకాయిన్స్ (Stablecoins) అనే డిజిటల్ ఆస్తులతో దేశాలు తప్పనిసరిగా మమేకం కావాల్సిందే. స్వాగతించినా, వ్యతిరేకించినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి” అని అన్నారు.

FM Nirmala Sitharaman Key Comments

ప్రస్తుతం భారత్‌లో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధ గుర్తింపు లేకపోయినా, వాటి లావాదేవీలపై పన్నులు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ జాగ్రత్తపూర్వక వైఖరిని ప్రదర్శిస్తుండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను పూర్తిగా నిషేధించాలని తరచూ కోరుతూ వస్తోంది.

అదే సమయంలో ఆర్‌బీఐ తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పై పైలట్ ప్రాజెక్టులను కూడా నడుపుతోంది. ఇది అధికారిక చెలామణి కరెన్సీకి సమానమైన చట్టబద్ధ మద్దతు పొందిన డిజిటల్ రూపాయి.

“స్థిరకాయిన్స్ వంటి కొత్త ఆవిష్కరణలు గ్లోబల్ మనీ ఫ్లో, మూలధన ప్రవాహాలపై విప్లవాత్మక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిణామాలు దేశాలను రెండు మార్గాల మధ్య నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. కొత్త ఆర్థిక వ్యవస్థలను ఆమోదించాలి లేదా గ్లోబల్ వేదికపై పక్కన పడిపోవాల్సి వస్తుంది” అని సీతారామన్ పేర్కొన్నారు.

అదే సమయంలో “ఏ దేశమూ ఇలాంటి మార్పుల నుంచి పూర్తిగా వేరుగా నిలవలేం. అవి నచ్చినా, నచ్చకపోయినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే” అని ఆమె స్పష్టం చేశారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, స్థిరకాయిన్స్ అనేవి సాధారణ క్రిప్టోకరెన్సీలకంటే భిన్నం. ఇవి అమెరికా డాలర్, బంగారం, లేదా పలు కరెన్సీల బాస్కెట్‌ వంటి ఆస్తులకు అనుసంధానమై ఉంటాయి. దీంతో వీటి ధరలు స్థిరంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

Also Read : RBI Important Update : జన్ ధన్ ఖాతాదారులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

Exit mobile version