National Medical Commission : ఢిల్లీ – జాతీయ వైద్య కమిషన్ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐదు సంవత్సరాలలో దేశంలో 75,000 కొత్త వైద్య సీట్లను మంజూరు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఎంబీబీఎస్ (MBBS), పీజీ సీట్లను పెంచేందుకు కొత్తగా నియమాలు తయారు చేశామని పేర్కొంది. అంతే కాకుండా ఆయా మెడికల్ కాలేజీలలో బోధన , బోధనేతర సిబ్బందిని కూడా ఎంపిక చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో ప్రొఫెసర్ల సంఖ్యను కూడా పెంచుతామని వెల్లడించింది.
National Medical Commission Interesting Comments
వైద్య కళాశాలల్లో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission) వైద్య కళాశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడానికి , దేశ వ్యాప్తంగా మరిన్ని ఎంబీబీఎస్, పీజీ సీట్లను సృష్టించడానికి కొత్త నియమాలను ప్రవేశ పెట్టింది. ఈ కొత్త నియమాలు ఐదేళ్లలో వర్తింప చేసేలా చేస్తామని తెలిపింది.
220 కంటే ఎక్కువ పడకలు ఉన్న ఆసుపత్రులు ప్రస్తుతం బోధించక పోయినా , వాటిని వైద్య విద్యార్థుల కోసం శిక్షణా కేంద్రాలుగా ఆమోదించనున్నట్లు స్పష్టం చేసింది.ఇది మరిన్ని వైద్య కళాశాలలను తెరవడానికి సహాయ పడుతుందని పేర్కొంది.
10 సంవత్సరాల అనుభవం ఉన్న వైద్యులు ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్లుగా మారవచ్చు . అంతే కాకుండా 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేయవచ్చు . సీనియర్ రెసిడెన్సీ లేకుండా కూడా వారు 2 సంవత్సరాల లోపు అవసరమైన పరిశోధన కోర్సు పూర్తి చేస్తే ఛాన్స్ ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టులకు సీనియర్ రెసిడెంట్ కావడానికి గరిష్ట వయస్సు ఇప్పుడు 50 సంవత్సరాలు.
గతంలో మూడు నాన్-క్లినికల్ విభాగాలు మాత్రమే ఎంఎస్సీ , పీహెచ్డీ హోల్డర్లను ఫ్యాకల్టీగా నియమించుకున్నాయి. ఇప్పుడు, మైక్రోబయాలజీ , ఫార్మకాలజీ విభాగాలు కూడా అలా చేయగలవని, దీర్ఘకాల ఉపాధ్యాయ కొరతను పూడ్చడంలో సహాయ పడతాయని తెలిపింది. ప్రభుత్వ వైద్య సంస్థలలో 6 సంవత్సరాల అనుభవం ఉన్న డిప్లొమా హోల్డర్లు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మారవచ్చని పేర్కొంది.
Also Read : Chinta Mohan Sensational Comments : బీజేపీ పాలనలో అంతులేని అవినీతి – చింతా మోహన్
