Minister Sridhar Babu : హైదరాబాద్ : తమ సర్కార్ పై, ప్రధానంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి, అనుచరులు, తమ్ముళ్లను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu). కాంగ్రెస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, భూ పరివర్తన విధానం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేకూర్చేందుకేనని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. కె.టి. రామారావు కావాలని వక్రీకరణలు చేస్తున్నారని ఆరోపించారు. 9200 ఎకరాల్లో ఇది 4040 ఎకరాలు ప్లాట్ చేయబడిందని తెలిపారు. పరిశ్రమల యాజమాన్యంలోని ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన ఇంపాక్ట్ ఫీజును మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు శ్రీధర్ బాబు.
Minister Sridhar Babu Refuses KTR Comments
భూమి మార్పిడి ద్వారా రాష్ట్రం దాదాపు రూ 4,000 నుండి రూ. 5,000 కోట్ల వరకు ఆదాయాన్ని ఆశిస్తోందని అన్నారు. భూమి ఉన్నవారు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కలిగి ఉంటారని స్పష్టం చేశారు మంత్రి. కె.టి.ఆర్ ఖాళీ వాదనలు చేయడం మానేయాలని హితవు పలికారు. మాజీ మంత్రి కోట్ చేస్తున్న 30 శాతం సంఖ్య భూమి విలువ కానే కాదన్నారు. ఇది కేవలం మార్పిడికి సంబంధించి నిర్దేశించిన రుసుము మాత్రమేనని స్పష్టం చేశారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఫ్రీహోల్డ్, లీజు భూములపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకదానికొకటి సంబంధం లేదన్నారు.లీజు భూములను ఫ్రీహోల్డ్గా మార్చడానికి జి.ఓ.లు జారీ చేసింది మునుపటి బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాజకీయ మైలేజ్ కోసం వారు భూమి విలువకు మార్పిడిని లింక్ చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పేర్కొన్న ఎవరైనా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారని నిరూపిస్తే, ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్నారు.
Also Read : Telangana Young Writers Competition Interesting : తెలంగాణ యంగ్ రైటర్స్ కాంపిటీషన్
