కోల్ కతా : పార్టీ పేరు, గుర్తును స్తంభింప జేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాఖలు చేసిన తన పిటిషన్లో బెనర్జీ ఎన్నికల సంఘాన్ని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకురాలు రీటాబ్రత బెనర్జీని పార్టీ ప్రతివాదులుగా చేర్చారు. కోల్కతాలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడారు. టీఎంసీలోని రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పేరు, పార్టీ గుర్తును స్తంభింప జేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేశారు. ఈ వివాదంపై సవివరమైన నిర్ణయం వెలువడే వరకు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, దాని రిజర్వ్డ్ గుర్తును ఉపయోగించకుండా రెండు వర్గాలను నిషేధించాలని ఒక రోజు ముందు తీసుకున్న మధ్యంతర నిర్ణయాన్ని అనుసరించి, ఎన్నికల సంఘం శుక్రవారం రెండు ప్రత్యర్థి వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది.
టీఎంసీ పేరు, గుర్తును ఈసీ ఫ్రీజ్ చేయడం ‘ప్రజాస్వామ్యానికి నల్లరోజుస అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. తన మధ్యంతర ఉత్తర్వులో బెనర్జీ , అరూప్ రాయ్ నేతృత్వంలోని రెండు వర్గాల నాయకుల వాదనలు విన్న తర్వాత ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు 1968 నిబంధనల ప్రకారం ఈ విషయంపై ఎన్నికల సంఘం సవివరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్లో, బెనర్జీ ఎన్నికల సంఘాన్ని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలైన రీటాబ్రతా బెనర్జీని పార్టీ ప్రతివాదులుగా చేర్చారు. తృణమూల్ కాంగ్రెస్ పేరు ‘జోరా ఘాష్ ఫుల్’ గుర్తును ఫ్రీజ్ చేయాలన్న ఈసీ నిర్ణయంపై బెనర్జీ విమర్శలు గుప్పించారు. పార్టీ గుర్తింపు కోల్పోవడాన్ని, బిడ్డను కోల్పోయిన తల్లి బాధతో పోలుస్తూ, దీనిని దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక “నల్లరోజు”గా అభివర్ణించారు.
మధ్యంతర ఏర్పాటును ఒక రాజీగా తాను అంగీకరించబోనని, పార్టీ అసలైన గుర్తింపును, దాని ‘పువ్వులు-గడ్డి’ చిహ్నాన్ని రాజకీయంగా, ప్రజాస్వామ్య బద్ధంగా, చట్టబద్ధంగా తిరిగి పొందేందుకు చివరి వరకు పోరాడతానని బెనర్జీ ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్, రేజినగర్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఆమె వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరును, ‘ఫుట్బాల్ ప్లేయర్’ చిహ్నాన్ని కేటాయించిన కొన్ని గంటల తర్వాత ఆమె ఈ ప్రకటనలు చేశారు.
