KTR Shocking Comments on CM : 9,295 ప్ర‌భుత్వ భూముల‌పై క‌న్నేసిన సీఎం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Shocking Comments on CM

Hello Telugu - KTR Shocking Comments on CM

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కాంకు తెర తీశాడ‌ని, ఇది క‌నీసం మార్కెట్ ప‌రంగా చూస్తే రూ. 4 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే ఉంటుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100%, 200% శాతం ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టామని స్ప‌ష్టం చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి, AV.రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30% ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేసేలా కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా చేశార‌ని మండిపడ్డారు. 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

KTR Shocking Allegations on CM Revanth Reddy

తెలంగాణ భ‌వ‌న్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ 30% ప్రభుత్వానికి వస్తే, మిగతా 60% రేవంత్ రెడ్డి దోచుకునే ప్రయత్నంలో ఉన్నాడని ధ్వ‌జ‌మెత్తారు. ఏవీ రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణా రెడిలతో కూడిన ఒక ముఠా హైదరాబాద్‌లో తిరుగుతోంద‌ని ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. లేక‌పోతే లూటీ చేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు. రేవంత్ బిజినెస్ పార్ట్నర్స్, కుటుంబ సభ్యులైన వీళ్లు.. పారిశ్రామిక వాడకి సంబంధించిన 4,5 లక్షల కోట్ల విలువ చేసే 9,295 ఎకరాల ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఎవ‌రూ ఒత్తిళ్ల‌కు లొంగ వ‌ద్ద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చాక తీసుకున్న వాటిని ర‌ద్దు చేసి తీరుతామ‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక‌నైనా సీఎం రేవంత్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Also Read : DK Shivakumar Shocking Comments on CM Post : సీఎం ప‌ద‌విపై డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version