Kondareddypally : నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డిపల్లి అరుదైన ఘనత సాధించింది. దక్షిణ భారత దేశంలోనే తొలి 100 శాతం సౌరశక్తి గ్రామంగా చరిత్ర సృష్టించింది. ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక పల్లెగా నిలిచింది. ఈ ఊరు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలో ఉంది. ఇక్కడ 514 గృహాలు , 11 ప్రభుత్వ సేవా సంస్థలు ఉన్నాయి. పూర్తిగా సౌరశక్తితో నడుస్తోంది ఈ గగ్రామం. పునరుత్పాదక ఇంధన స్వీకరణకు కేంద్రంగా మారింది కొండారెడ్డిపల్లి (Kondareddypally). ఇక్కడ ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాన్ని స్వచ్ఛమైన శక్తి ఉత్పత్తిదారుగా మార్చింది. గృహాల కోసం ఒక్కొక్కటి 3 KW 480 పైకప్పు సౌరశక్తి యూనిట్లు ,ప్రభుత్వ సేవల కోసం 60 KW కంటే పెద్ద వ్యవస్థల ద్వారా మొత్తం 1,500 కిలో వాట్స్ విద్యుత్ ఉత్పత్తిని చేసేలా తిర్చిదిద్దారు.
Kondareddypally Viral
రూ. 10.53 కోట్ల ప్రాజెక్టును బహుళ నిధుల వనరుల ద్వారా సాకారం చేశారు: కేంద్ర సబ్సిడీల నుండి రూ. 3.56 కోట్లు, ప్రీమియర్ ఎనర్జీస్ నుండి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మద్దతు కింద రూ. 4.09 కోట్లతో పాటు మౌలిక సదుపాయాల అప్గ్రేడ్ల కోసం రూ. 2.59 కోట్లు ఖర్చు చేశారు. ఈ చొరవ కారణంగా ప్రతి ఇల్లు నెలకు దాదాపు 360 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. మిగులు విద్యుత్ను యూనిట్కు రూ.5.25 చొప్పున గ్రిడ్కు విక్రయిస్తారు, గ్రామస్తులను సాధారణ ఆదాయం పొందే వనరుగా మారేలా చేసింది.
సెప్టెంబర్ నెలలో గ్రామం 1 లక్ష యూనిట్లను ఎగుమతి చేసి, దాదాపు రూ. 5 లక్షల ఆదాయాన్ని ఉత్పత్తి చేయడం విశేషం. దీంతో కొండారెడ్డిపల్లి దేశంలోనే రెండో సౌర విద్యుత్ తో నడిచే గ్రామంగా నిలిచి పోయింది.
Also Read : Ibomma Shocking Response : పోలీసుల ప్రకటన ఐబొమ్మ ప్రతిస్పందన
