PM Kisan Interesting Update : రైతన్నలకు పీఎం కిసాన్ 21వ విడత పై కీలక అప్డేట్

ఇప్పటి వరకు 20 విడతల నిధులు రైతులకు చేరగా, తాజాగా 21వ విడత విడుదలైంది...

PM Kisan : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలలో పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇప్పటి వరకు 20 విడతల నిధులు రైతులకు చేరగా, తాజాగా 21వ విడత విడుదలైంది.

శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలోని రైతుల కోసం పీఎం కిసాన్ (PM Kisan) పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ రాష్ట్రాలు ఇటీవల వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం చవిచూసిన నేపథ్యంలో ముందస్తుగా ఈ విడత విడుదల చేసినట్లు తెలిపారు.

PM Kisan – రూ.540 కోట్లు – 27 లక్షల మంది రైతులకు లబ్ధి

వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని 27 లక్షలకుపైగా రైతులకు (వారిలో మహిళా రైతులు కూడా ఉన్నారు) రూ.540 కోట్లకుపైగా నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.

ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 జమ కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి, వ్యవసాయం తిరిగి ప్రారంభించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

పీఎం కిసాన్ పథకం – ముఖ్యాంశాలు

అర్హత ప్రమాణాలు

లబ్ధిదారుల స్థితి తనిఖీ విధానం

వరదలతో నష్టపోయిన రైతులకు ఈ విడత కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read : Today Gold Price : నేడు స్వల్ప పెరుగుదలతో నడుస్తున్న పసిడి ధరలు

Exit mobile version