అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి జగన్ 5 ఏళ్ల పాలన అబద్ధాలను బట్టబయలు చేసిందని, అయినా బుద్ది రావడం లేదంటూ మండిపడ్డారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ కు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 1674 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించకపోతే కూటమి సర్కార్ మానవతా దృక్ఫథంతో చర్యలు తీసుకుందని, వెంటనే నిధులు విడుదల చేసిందని చెప్పారు. అంతే కాకుండా రైతు ఆత్మహత్యల కుటుంబాలకు కూడా బకాయిలు చెల్లంచామన్నారు. మద్ధతు ధరల కోసం రైతులకు 16 నెలల్లో ఏకంగా రూ. 800 కోట్లు ఖర్చు చేశామని వెల్లడంచారు కింజరాపు అచ్చెన్నాయుడు. ఇదిలా ఉండగా మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే జగన్ తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.
రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ మరోసారి అబద్ధాలతో ప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు . గత ఐదేళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పరిపాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడానికి ప్రధాన కారణమని ఆవేదన చెందారు. ఇప్పుడు ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకు అబద్ధాల అంబాసడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, పంట కొనుగోళ్ల వేగం, తక్షణ సహాయ చర్యలపై స్పష్టమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచామన్నారు. కాగా ఉన్నట్టుండి వక్రీకరించి ప్రజలో గందరగోళం సృష్టించడం జగన్కు అలవాటై పోయిందని మంత్రి పేర్కొన్నారు.
