Shafali Verma : ముంబై : భారత మహిళా జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ముంబై బీవై పాటిల్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన కీలకమైన ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది . చరిత్ర సృష్టించింది. టాస్ ఓడి పోయిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనింగ్ పార్టనర్ షిప్ సూపర్ గా సాగింది. వైస్ కెప్టెన్ స్మృతీ మందన్నా, షెఫాలీ వర్మలు (Shafali Verma) సూపర్ షో చేశారు. ఈ ఇద్దరూ కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన జెమీమా, కెప్టెన్ కౌర్ లు ఆశించినంత మేర ఆడలేక పోయారు. కానీ ఇతర ఆటగాళ్లు స్కోర్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
Shafali Verma Sensational
ఇదిలా ఉండగా షెఫాలీ వర్మ నాకౌట్ దశలోకి వచ్చింది. తొలి వికెట్ కు మందన్నాతో కలిసి 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 రన్స్ చేసింది. 104 పరుగులు జోడించింది. జోరు మీదున్న స్మృతీ మందన్నా ట్రయాన్ వేసిన 8 ఓవర్లలో నాలుగో బంతికి అవుట్ అయ్యింది. జమీమీ తో కలిసి షెఫాలీ వర్మ స్కోర్ వేగాన్ని పెంచింది. జెమీమా 24 రన్స్ చేసింది. ఇదిలా ఉండగా ఖాకా వేసిన 28వ ఓవర్ లో వర్మ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నం చేసింది. మిడాఫ్ లో లుస్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టును తన బౌలింగ్ తో కట్టడి చేసింది. 2 వికెట్లు తీసింది షెఫాలీ వర్మ. ప్లేయర్ ఆఫ్ ది ఉమెన్ అవార్డు పొందింది.
Also Read : India Women Cricket Team Sensational : చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
