IAS Lakshmisha : విజయవాడ – పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాలలో ప్రపంచ రికార్డును సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు కలెక్టర్ లక్ష్మిశ. ప్రకృతితో సామరస్యంగా పండుగను జరుపుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఇంట్లో మట్టి విగ్రహాలను తయారు చేసుకోవాలని , వాటిని 91549 70454 నంబర్లో వాట్సాప్ ద్వారా ఫోటోలను షేర్ చేయాలని కలెక్టర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాబోయే వినాయక చవితిని పర్యావరణ అనుకూలంగా మార్చే ప్రయత్నంలో, ఆగస్టు 26న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మట్టి విగ్రహాల తయారీ పోటీని నిర్వహిస్తున్నట్లు ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ (IAS Lakshmisha) ప్రకటించారు.
IAS Lakshmisha New Thought
ఇక్కడ పాల్గొనే వారు ప్రపంచ రికార్డును సృష్టించడానికి ప్రయత్నించేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు. ప్రకృతితో సామరస్యంగా పండుగను జరుపుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ అనుకూల పద్ధతుల గురించి అవగాహన పెంచడమే కాకుండా, అపూర్వమైన స్థాయిలో రికార్డు బద్దలు కొట్టే మట్టి విగ్రహాలను సృష్టించే ప్రయత్నాలను కూడా అని పేర్కొన్నారు కలెక్టర్ . మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిపై రెండవ వరద హెచ్చరిక అవకాశం ఉన్నందున సింథటిక్ పెయింట్స్, రసాయనాలు, థర్మోకోల్ వాడకాన్ని హెచ్చరించారు, అలాంటి పదార్థాలు నీటి వనరులను కలుషితం చేస్తాయని , సముద్ర జీవులకు ప్రమాదం కలిగిస్తాయని హెచ్చరించారు.
Also Read : TG High Court Shocking : కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలు ఎప్పుడు..?

















