Hyundai Huge Investment : వచ్చే 5 ఏళ్లలో భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న హ్యుండయ్‌

మిగిలిన 40 శాతం తయారీ సామర్థ్య పెంపు, ప్లాంట్ల ఆధునికీకరణకు వినియోగించనున్నట్లు తెలిపారు.

Hello Telugu - Hyundai Huge Investment

Hello Telugu - Hyundai Huge Investment

Hyundai : దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుండయ్‌ (Hyundai) మోటార్‌ భారత మార్కెట్లో తన స్థానం మరింత బలపరచేందుకు భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. కంపెనీ భారత అనుబంధ సంస్థ హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో, అంటే 2029-30 నాటికి రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

ఈ వివరాలను కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ జోస్‌ మునోజ్‌ వాటాదారుల సమావేశంలో వెల్లడించారు. ఈ నిధుల్లో 60 శాతం ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మరియు పరిశోధన-అభివృద్ధికి (R&D), మిగిలిన 40 శాతం తయారీ సామర్థ్య పెంపు, ప్లాంట్ల ఆధునికీకరణకు వినియోగించనున్నట్లు తెలిపారు.

Hyundai – 2030 నాటికి భారత్‌ – హ్యుండయ్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌ లక్ష్యం

ప్రస్తుతం భారత్‌ హ్యుండయ్‌కు (Hyundai) మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కంపెనీ ప్రపంచ విక్రయాల్లో భారత్‌ వాటా 15 శాతంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ను రెండో అతిపెద్ద మార్కెట్‌గా తీర్చిదిద్దడమే సంస్థ ప్రధాన లక్ష్యం అని మునోజ్‌ పేర్కొన్నారు.

కొత్త మోడల్స్‌, ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టి

2029-30 నాటికి 7 కొత్త కార్లతో సహా మొత్తం 26 మోడల్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని హ్యుండయ్‌ ప్రణాళిక.

ఫైనాన్స్‌ విభాగం భారత్‌లోకి

హ్యుండయ్‌ క్యాపిటల్‌ (సేల్స్‌ ఫైనాన్స్‌ విభాగం) వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ విభాగాన్ని విస్తరించనుంది.

భారత్‌ మార్కెట్‌ లక్ష్యాలు

చిన్న కార్ల విభాగంలో కొనసాగింపు

భారత్‌లో చిన్న కార్లకు గిరాకీ కొనసాగుతుందని, ఈ విభాగం నుంచి హ్యుండయ్‌ వైదొలగే ఉద్దేశం లేదని సీఈఓ మునోజ్‌ స్పష్టం చేశారు.

తరుణ్‌ గార్గ్‌ కొత్త ఎండీ, సీఈఓ

Also Read : Today Gold Price : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు

Exit mobile version