Home Minister Anitha : అమరావతి : ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ సర్కార్ ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అవసరమైతే తరలించాలని స్పష్టం చేశారు మంత్రి.
Home Minister Anitha Comments
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం , రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం , పోలీసు, అగ్నిమాపక సేవల నియంత్రణ గదులను ,హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రాష్ట్రాన్ని సమీపిస్తున్నందున పూర్తిగా సిద్ధంగా ఉండాలని అన్నారు. భారీ వర్షాలు , వరదలకు గురయ్యే దుర్బల జిల్లాల్లో నివారణ చర్యలను కోరుతూ క్షేత్ర స్థాయి అధికారులు ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ( ప్రకారం, ఈ అల్పపీడనం శనివారం ఉదయం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని వలన కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు వంగలపూడి అనిత.
Also Read : TTD Simha Vahanam Seva Interesting : అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుand
