Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ పోతున్న పసిడి ధరలు

మరోవైపు వెండి ధర కిలోకు రూ.1,19,800, ప్లాటినం ధర రూ.38,160కు చేరింది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : భారత్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ధరలకు మరింత ఊపునిస్తున్నాయి. ఆగస్టు 30న దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం (Gold) ధర స్వల్పంగా పెరిగి రూ.1,03,320కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,710, 18 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.77,490గా నమోదైంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.1,19,800, ప్లాటినం ధర రూ.38,160కు చేరింది.

Gold – ధరల పెరుగుదల కారణాలు

ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, దేశంలో పండుగ సీజన్‌తో కూడిన డిమాండ్ పెరుగుదలతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అలాగే యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం బంగారం ధరలను పెంచుతున్న ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

వెండి ధరలు (కిలోకు)

Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు

Exit mobile version