Ferdanand Marcos Interesting Comments : ఇండియాతో ఫిలిప్పీన్స్ కు విడ‌దీయ‌ని బంధం

స్ప‌ష్టం చేసిన అధ్య‌క్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోజ్

Hello Telugu - Ferdanand Marcos Interesting Comments

Ferdanand Marcos : ఢిల్లీ – ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ (Ferdanand Marcos) జూనియర్ సోమవారం తన తొలి భారత పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి (ఎంఓఎస్) పబిత్రా మార్గెరిటా విమానాశ్రయంలో ఆయనకు ఘ‌న స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఉన్నారు. ఈ పర్యటన భారతదేశం, ఫిలిప్పీన్స్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశం, ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ పర్యటన భారతదేశం-ఫిలిప్పీన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దారితీస్తుంది అని జైస్వాల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు.

Ferdanand Marcos Key Comments

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం భారతదేశంలో ఉన్నారు. ఆయనతో పాటు ప్రథమ మహిళ మేడమ్ లూయిస్ అరనేటా మార్కోస్ కూడా ఉన్నారు. ఆయన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో సమావేశమై బెంగళూరుకు కూడా వెళతారు, ఆగస్టు 8న ఫిలిప్పీన్స్‌కు తిరిగి వెళ‌తారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు స‌బంధించి ఎంఈఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధ్యక్షుడు మార్కోస్ భారతదేశానికి చేస్తున్న తొలి పర్యటన ఇది. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి అధ్యక్షుడు మార్కోస్ ఆగస్టు 5న ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అధ్యక్షుడు మార్కోస్ రాష్ట్రపతిజీ శ్రీమతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. ఈ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా అధ్యక్షుడు మార్కోస్‌ను కలవనున్నారు.

Also Read : Minister Pankaj Chaudhary Alarming : కొత్త ప‌న్ను విధానం గ‌ణ‌నీయ‌మైన ఉప‌శ‌మ‌నం

Exit mobile version