హైదరాబాద్ : దక్షిణాది అమితాబ్ బచ్చన్ గా పేరు పొందారు తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నయనతార. తాను తాజాగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన యష్ నటించిన టాక్సిక్ లో నటించింది. తనతో పాటు హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ , కృతి సనన్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇందులో యష్ కు సోదరిగా నయనతార నటించింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. అంతే కాదు తన సినీ కెరీర్ లో ఎక్కువగా సినీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే బెంగళూరు వేదికగా జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తను అన్నింటిని పక్కన పెట్టి భర్తతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. అందరినీ విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా తను మాట్లాడుతూ రాఖీ భాయ్ అంటూ సంబోదించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉండగా 2026లో నయనతారకు మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పక తప్పదు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయంతో 2026ను ఘనంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత నయనతారకు మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. ‘టాక్సిక్’ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది, అలాగే ఆమె నటించిన తాజా తమిళ చిత్రం ‘హాయ్’ కూడా మిశ్రమ స్పందనను పొందిందని నిర్మాతలు పేర్కొంటున్నారు. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, నూతన దర్శకుడు విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ‘హాయ్’ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించిన నయనతార, ఇంటర్వ్యూలు , బహిరంగ కార్యక్రమాల ద్వారా చురుకుగా ప్రచారం చేశారు, ఇది ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. దురదృష్టవశాత్తు, ఈ చిత్రం కొంతమంది ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది. కవిన్ మరియు నయనతార మంచి నటనను ప్రదర్శించినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసేంత ఆసక్తికరమైన కథనం ఇందులో లేదని చాలామంది భావిస్తున్నారు. సాధారణంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన సగటు లేదా అంతకంటే తక్కువగానే ఉంది అని ఆ నిర్మాత జోడించారు.
