Tejashwi Yadav : బీహార్ : ఆర్జేడీ అగ్ర నాయకుడు , మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసందర్బంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పూర్తి భరోసా ఇచ్చారు. తాము గనుక అధికారంలోకి వచ్చాక శాశ్వత ఉద్యోగాలు కల్పించి తీరుతామని హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్. ప్రతిపక్ష కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ‘కమ్యూనిటీ మొబిలైజర్లకు’ నెలకు రూ. 30,000 జీతం కూడా ఇస్తామని యాదవ్ హామీ ఇచ్చారు. ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు తేజస్వి యాదవ్.
Ex BY CM Tejashwi Yadav Comments
రాష్ట్రంలో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే వివిధ బీహార్ ప్రభుత్వ విభాగాలలో పని చేస్తున్న అన్ని కాంట్రాక్టు కార్మికులతో పాటు కమ్యూనిటీ మొబిలైజర్లను సైతం పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. పవర్ లోకి వచ్చిన వెంటనే భారీ ఎత్తున వేతనాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే జీవిక దీదీలు తీసుకున్న రుణాలపై వడ్డీలు మాఫీ కూడా చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ పేదల సామాజిక ,ఆర్థిక సాధికారత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయంతో ‘జీవిక’ అని పిలువబడే బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తోంది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న మహిళలను ‘జీవిక దీదీలు’ అని పిలుస్తారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి.ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.
Also Read : Nara Lokesh Important Meet : ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి


















