CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణంలో యువత నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఐటీఐలు మొదట ఏర్పాటు చేయబడినప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని ఎప్పుడూ అప్గ్రేడ్ చేయలేదని సీఎం ఎత్తి చూపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీలు) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అప్గ్రేడేషన్ లేక పోవడం వల్ల అంతగా అభివృద్ది చెందలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. మనకు దృఢ సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని అన్నారు.
CM Revanth Reddy Comments
యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కేంద్రాలు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి యువతను శక్తివంతం చేస్తాయని చెప్పారు సీఎం. . మాదకద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు, ఏటీసీ విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్షిప్లు ఇచ్చేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. విద్యార్థులకు నెలవారీ రూ. 2,000 స్కాలర్షిప్ అందించాలని ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబును కూడా ఆయన కోరారు. ప్రపంచ అవకాశాలను హైలైట్ చేస్తూ, విదేశీ ఉపాధిని సులభతరం చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జపాన్లో ఉద్యోగాలను పొందడంలో తెలంగాణ యువతకు సహాయ పడటానికి జపనీస్ భాషా శిక్షణను ప్రవేశపెడతామని రేవంత్ ప్రకటించారు.
Also Read : KTR Fired on Congress : కాంగ్రెస్ హామీలు గాలిలో దీపాలు : కేటీఆర్
